ఇక్కడ కాకతీయుల పాలన సమయం లోనే, అక్కడ డిల్లీలో తురుష్క సుల్తానుల పరిపాలన. ఉత్తర భారతంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలన్నిటిలోని అత్యంత ప్రధానమైన దేవాలయాలన్నీ ధ్వంసంచేయబడ్డాయి. వారి మతవ్యాప్తి కూడా “నీ ప్రాణమా? నీ మతమా?” అనే తీరులో సాగుతున్నదన్న వార్తలు దక్షిణానికి కూడా చేరాయి. ముఖ్యంగా బౌద్ధమతం ఎక్కువ వ్యాప్తిలో ఉన్న ప్రాంతాలన్నిటిలో ఇస్లాం బాగా వ్యాపించింది. మెల్లగా తురుష్కుల దృష్టి దక్షిణభారత దేశంవైపు పడుతున్నది. ముస్లిములపాలనలో ఇంత విధ్వంసం ఎందుకు జరిగినది? రాజ్యాలమధ్య యుద్ధాలు, సామ్రాజ్యాలు విస్తరించడమూ పూర్వమునుండీ ఉన్నవీ. వీళ్ళతో ప్రత్యేక సమస్య ఏమిటి? ఈ మతస్థులు విదేశీయులుగా వచ్చారు. చాలాకాలం విదేశీయులుగానే ఉన్నారు. వారితోపాటు వారి ప్రజలు, వారి మతము, వారి ప్రత్యేక వేష భాషలు (ముఖ్యంగా అరబిక్, పారశీక భాషలు), వారి గ్రంధము అరబిక్ భాషలోని ఖురాన్ - అన్నీ వచ్చాయి. వారి మత సిద్ధాంతాల దృష్టికోణంలో భారతీయులు అనాగరికులు, విగ్రహారాధకులు, సంస్కరింపబడ వలసిన వారు. వారిని తమ మార్గంలోనికి మార్చడానికి రాజకీయ బలం ఉంది. భారతీయులు మతం మారని వారు దాస్యవృత్తిలోనే ఉండాలి. ఇక్కడి ఐశ్వర్యం, ధనం, సంపద, స్త్రీలు,వారికి భోగ వస్తువులే. మతం మార్చుకున్నవారు వారి పాత పద్ధతులను వదిలి పూర్తిగా వారి నూతన పద్ధతులను అనుసరించ వలసినదే. ఒకటి రెండు తరాలలో వారి పూర్వ చరిత్రను మరచిపోవలసినదే. కాఫిర్, రిద్ధా, ఉమ్మా, జిహాద్, ధిమ్మి, దార్ - ఉల్ -ఇస్లాం, దార్-ఉల్-హర్బ్, జిజియా, ఫట్వా - ఇలాంటి పదాలన్నీ అన్య మతస్తులకు ఇస్లాం అంటే ఒకరకమైన భయాన్ని కల్పిస్తాయి. ఆ పదాలకు అనేక రకములైన అర్థములుండవచ్చును. కాని చూడగానే ఈ మతము సనాతన ధర్మమునకు పూర్తిగా వ్యతిరేకమని అనిపించడానికి ఆస్కారమున్నది. వేయి సంవత్సరాల సహజీవనం తరువాత కూడా 20 వ శతాబ్దములో వారు Two Nation Theory ప్రతిపాదించి దేశవిభజన సాధించారంటే సగటు మనుషులు ఏమనుకోవాలి? Integration is probably unthinkable, peaceful coexistence may only be the achievable goal. The pluralistic American society is a melting-pot model while India with its variety can only follow a mosaic model.
Showing posts with label కాకతీయులు. Show all posts
Showing posts with label కాకతీయులు. Show all posts
Sunday, January 21, 2018
కాకతీయులు
https://www.facebook.com/vallury.sarma/posts/510023842368367
తూర్పు చాళుక్యులు, చాళుక్యచోళులయ్యారు. రాజమండ్రీ తరువాత చందవోలు కొన్నిరోజులు వెలనాటిచోళుల ముఖ్య నగరంగా ప్రాధాన్యత పొందినది. తరువాత వెలనాటి చోళులు కాకతీయులచేత ఓడింపబడ్డారు. కాకతీయుల వైభవానికి కేంద్రం వరంగల్లు (ఓరుగల్లు, ఏక శిలానగరం).వీరశైవం పోషింపబడినది. వీళ్ళు మొదట కల్యాణి చాళుక్యుల సామంతులు. పశ్చిమ చాళుక్య రాజధాని కల్యాణికి (నేటి బసవకల్యాణ్, బీదర్ జిల్లా) మారింది. కర్ణాటకలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసళ రాజులు,కలచూరి వంశస్థులు ఇలా ఇందరి చిన్న చిన్నరాజ్యాలుగా కర్ణాటక దేశం పాలింపబడినది.ఈ కలహాలలో కాకతీయులు స్వాతంత్ర్యము ప్రకటించుకున్నారు.
ఈ కలచూరి వంశం కూడా కల్యాణినే రాజధానిగా చేసుకున్నది. కొలది సంవత్సరాలే పాలించినా వీరి పాలనలో ఒక నూతన మతం, బసవేశ్వరుని వీరశైవం (లింగాయతమతం) కర్ణాటక సమాజములొ పెద్ద మార్పులు తీసికొని వచ్చింది. కలచూరి వంశ పాలకుడు బిజ్జలునికి, బసవన్న ప్రధాన మంత్రి. ఆంధ్ర ప్రదేశములొ రెడ్డి, కమ్మ కులాల వారి ప్రాబల్యం ఎలాగో, కర్ణాటకలో లింగాయత, వొక్కళిగ కులాల ప్రాబల్యం ఎక్కువ. (యెడ్డియూరప్ప లింగాయత్, దేవెగౌడ వొక్కళిగ.) (వర్ణ వ్యవస్థను నమ్మని లింగాయత మతం, సమాజములో ఒక కులంగా భావింపబడుతూంది. )
ఈ వీరశైవమతం అనే పేరు రెండు మార్గాల ప్రజలకు వాడుతారు. ఆంధ్రదేశంలో శివాద్వైతులుగా, శివ విశిష్టాద్వైతులుగా పిలువబడి వేదముల ప్రామాణ్యతను స్వీకరించేవారు, మల్లికార్జున పండితారాధ్యుని వంటి వారిది ఒక మార్గం. 12 వ శతాబ్దములో బిజ్జలుని ప్రధాన మంత్రిగా పనిచేసిన సంస్కర్త, రాజనీతిజ్ఞుడు ఐన బసవేశ్వరుని అనుయాయులది రెండవ మార్గం. వారిద్దరూ కలసి వీరశైవాన్ని ఏక త్రాటిపై నడిపించడం - వారు సంకల్పించినా - శివ సంకల్పము వేరుగా ఉండుటవలన జరగలేదు.
మొదటి వీరశైవం రామానుజ, పూర్ణప్రజ్ఞ దర్శనములవలెనే సనాతన ధర్మములో దర్శనమనీ, లింగాయత మతము, బౌద్ధ, జైన సిఖ్ఖు మతములవలెనే ప్రత్యేక మతమని కొందరి నమ్మకం. ఈ ప్రత్యేక మతమనే భావము క్రైస్తవ, మహమ్మదీయ మతాలనుండి దిగుమతిచేసుకున్న అభిప్రాయం. ఒకే పుస్తకం, ఒకే ప్రవక్త, అదే అంతిమ మరియు శాశ్వత సత్యమనే భావమే ఈ మతాలను అనుసరించేవారి దృఢ విశ్వాసాలకి కారణం. బుద్ధుడు, మహావీరుడు, బసవేశ్వరుడు, గురునానక్ కూడా నూతన సత్యాలను ఆవిష్కరించలేదు. వారు నమ్మే (లేక నమ్మని) ఒకే దేవుడు వారికి సందేశాన్ని ఈయలేదు. వారుబోధకులు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారు బోధించారు. Is a scripture a rule book or a memorandum of association? వారి తరువాత జరిగిన విషయాలకు వారిని బాధ్యులనుచేయడం ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ అనే మతానికి గాంధీ (మహాత్ముడు) ప్రవక్త అన్నట్లు ఉంటుంది.
తూర్పు చాళుక్యులు, చాళుక్యచోళులయ్యారు. రాజమండ్రీ తరువాత చందవోలు కొన్నిరోజులు వెలనాటిచోళుల ముఖ్య నగరంగా ప్రాధాన్యత పొందినది. తరువాత వెలనాటి చోళులు కాకతీయులచేత ఓడింపబడ్డారు. కాకతీయుల వైభవానికి కేంద్రం వరంగల్లు (ఓరుగల్లు, ఏక శిలానగరం).వీరశైవం పోషింపబడినది. వీళ్ళు మొదట కల్యాణి చాళుక్యుల సామంతులు. పశ్చిమ చాళుక్య రాజధాని కల్యాణికి (నేటి బసవకల్యాణ్, బీదర్ జిల్లా) మారింది. కర్ణాటకలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసళ రాజులు,కలచూరి వంశస్థులు ఇలా ఇందరి చిన్న చిన్నరాజ్యాలుగా కర్ణాటక దేశం పాలింపబడినది.ఈ కలహాలలో కాకతీయులు స్వాతంత్ర్యము ప్రకటించుకున్నారు.
ఈ కలచూరి వంశం కూడా కల్యాణినే రాజధానిగా చేసుకున్నది. కొలది సంవత్సరాలే పాలించినా వీరి పాలనలో ఒక నూతన మతం, బసవేశ్వరుని వీరశైవం (లింగాయతమతం) కర్ణాటక సమాజములొ పెద్ద మార్పులు తీసికొని వచ్చింది. కలచూరి వంశ పాలకుడు బిజ్జలునికి, బసవన్న ప్రధాన మంత్రి. ఆంధ్ర ప్రదేశములొ రెడ్డి, కమ్మ కులాల వారి ప్రాబల్యం ఎలాగో, కర్ణాటకలో లింగాయత, వొక్కళిగ కులాల ప్రాబల్యం ఎక్కువ. (యెడ్డియూరప్ప లింగాయత్, దేవెగౌడ వొక్కళిగ.) (వర్ణ వ్యవస్థను నమ్మని లింగాయత మతం, సమాజములో ఒక కులంగా భావింపబడుతూంది. )
ఈ వీరశైవమతం అనే పేరు రెండు మార్గాల ప్రజలకు వాడుతారు. ఆంధ్రదేశంలో శివాద్వైతులుగా, శివ విశిష్టాద్వైతులుగా పిలువబడి వేదముల ప్రామాణ్యతను స్వీకరించేవారు, మల్లికార్జున పండితారాధ్యుని వంటి వారిది ఒక మార్గం. 12 వ శతాబ్దములో బిజ్జలుని ప్రధాన మంత్రిగా పనిచేసిన సంస్కర్త, రాజనీతిజ్ఞుడు ఐన బసవేశ్వరుని అనుయాయులది రెండవ మార్గం. వారిద్దరూ కలసి వీరశైవాన్ని ఏక త్రాటిపై నడిపించడం - వారు సంకల్పించినా - శివ సంకల్పము వేరుగా ఉండుటవలన జరగలేదు.
మొదటి వీరశైవం రామానుజ, పూర్ణప్రజ్ఞ దర్శనములవలెనే సనాతన ధర్మములో దర్శనమనీ, లింగాయత మతము, బౌద్ధ, జైన సిఖ్ఖు మతములవలెనే ప్రత్యేక మతమని కొందరి నమ్మకం. ఈ ప్రత్యేక మతమనే భావము క్రైస్తవ, మహమ్మదీయ మతాలనుండి దిగుమతిచేసుకున్న అభిప్రాయం. ఒకే పుస్తకం, ఒకే ప్రవక్త, అదే అంతిమ మరియు శాశ్వత సత్యమనే భావమే ఈ మతాలను అనుసరించేవారి దృఢ విశ్వాసాలకి కారణం. బుద్ధుడు, మహావీరుడు, బసవేశ్వరుడు, గురునానక్ కూడా నూతన సత్యాలను ఆవిష్కరించలేదు. వారు నమ్మే (లేక నమ్మని) ఒకే దేవుడు వారికి సందేశాన్ని ఈయలేదు. వారుబోధకులు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారు బోధించారు. Is a scripture a rule book or a memorandum of association? వారి తరువాత జరిగిన విషయాలకు వారిని బాధ్యులనుచేయడం ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ అనే మతానికి గాంధీ (మహాత్ముడు) ప్రవక్త అన్నట్లు ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)
The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2
https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...
-
https://www.facebook.com/vallury.sarma/posts/540571089313642 https://www.facebook.com/vallury.sarma/posts/540946075942810 https://www.f...
-
https://www.facebook.com/vallury.sarma/posts/615414371829313 Dr K. Sivananda Murty About the Book The Universe is perceived as the to...
-
https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...