Showing posts with label Gandhi. Show all posts
Showing posts with label Gandhi. Show all posts

Thursday, January 25, 2018

Ahimsa is one of the 4 pillars of our dharma. Isn't it?

https://www.facebook.com/vallury.sarma/posts/601244196579664

Ahimsa is one of the 4 pillars of our dharma. Isn't it?

Sumalini Soma Gandhi - didn't he use 3 major pillars of Dharma as part of his philosophy? Satyam, Ahimsa, Shouchamu? 

VVS Sarma
What is dharma? It is an extremely complex term of our Sanathana dharma, which is untranslatable. See these sentences --- Dharma means differently, denotes a different thing each time.
1. Ahimsa Paramo dharma ; Dharmam Saranam Gacchaami
2. Dharmo rakshati rakshita –
3. yada yada hi dharmasya glanir bhavati bharata| abhyutthanam adharmasya tadatmanam srjamyaham - says Krishna in Gita
4. Swadharme nidhanam shreyah paradharmo bhayaavahah. – Gita
5. Ramo vigrahavan dharma
# 1 is true only for sanyasis and householders in ordinary situation.
# 2, #4 mean to each one his own swa dharma – king’ dharma for king, soldier’s dharma for a soldier
# 3 means most people in the society are deviating from dharma and an avatara appears only when there is an intense prayer from the concerned. God has no sva-dharma to take suo moto action to appear on earth.
#5 Dharma is subtle. There are conflicts among various dharmas. Rama took his raja dharma as supreme and considered dharma to his wife as a lower level dharma which can be comprised.
Gandhi is not a dharmacharya His notions of satya, satyagraha, swarajya, his notion of “Iswar-Allah tere nam” are all faulty. He is an honest political leader but his dharma-adharma discrimination is faulty. In fact, he is failed political leader on many counts.

Acharya Sadananda Dharma for simplicity for transactions can be stated as follows. Do what I expect others do towards me and do not do what I expect other not to do towards me. For example, I expect others not to steel my property, not to lie to me, not to hurt me any way - therefore it becomes my dharma not to do those to others. I expect others to be compassionate towards me, help me when I am in need, forgive my mistakes, etc. Therefore it is my dharma to do the same for others - these become universal values. Himsa is hurting others for selfish reason. ahihma follows from the universal values. Fighting to protect the child or needy or the nation or ones dharma stated above is not himsa. Hence Krishana advises Arjuna to fight to protect the dharma. Krishna himself did not space anyone who is hurting others. Ultimately dharma of anything is that because of which it is - Mathematically - it is the necessary and sufficient qualification of any object or entity. I am what I am because the very core of my personality which is nothing but I am. That self that I am and its recognition is my essence - and that is where Lord also says He resides - I reside in everyone's heart - heart is the heart or essence of myself. Recognition o re-cognition of myself becomes my essential dharma - which is actually santaatana dharma. Religion that points to this fact is also sananatana dharma or later called Hinduism. Hari Om!

1934 లో బీహార్ లో ఒక భూకంపం వచ్చినది. మహాత్మా గాంధీ తన హరిజన్ పత్రికలో

https://www.facebook.com/vallury.sarma/posts/588337591203658


కేదార్ నాథ్ వరదల్లో కేదారేశ్వరునికీ, గంగమ్మతల్లికి కోపం వచ్చి యాత్రకు వెళ్ళిన భక్తులను రక్షించలేదు అని సెక్యులర్ మీడియా మొసలి కన్నీరు కార్చింది. ఇప్పుడు గుణదల మరియమ్మ, కరుణామయుడైన గొఱ్ఱెల కాపరి, ప్రార్థనతో వర్షాలను ఆపగల అనిల్ అన్నయ్య, చిక్కోలు జామియా మసీదు దేవుడు, మారచిపోయాను ఆంధ్ర ఒడీశా సరిహద్దు లోని మావో, మార్క్సు,లెనిన్ దేవుళ్ళు కూడా తుఫాను, అతివృష్టి నుంచి రక్షణ ఇవ్వలేదని అనకుండా ప్రభుత్వం ఏదోచేయలేదంటారేమిటి? వాతావరణ శాఖ చెబుతూనే ఉంది కదా?


1934 లో బీహార్ లో ఒక భూకంపం వచ్చినది. మహాత్మా గాంధీ తన హరిజన్ పత్రికలో దానిని గురించి వ్రాస్తూ, మనదేశంలోని అస్పృశ్యత వంటి సంఘపాపములవలన ఈ ప్రకృతి విపత్తు సంభవించినది.అని వ్రాశారు. దానికి జవాబు గా రవీంద్రనాథ టాగూర్ స్పందిస్తూ "ప్రకృతి విపత్తులను వ్యక్తుల పుణ్య పాపాలకు అంటకట్టడం సరియైనది కాదు. భూగోళ భౌతిక శాస్త్రం Geophysics భూకంపాలు ఎందుకు వస్తాయో విజ్ఞాన శాస్త్ర పరంగా నిర్వచిస్తుంది. దానికి వ్యక్తుల గుణగణాలకు సంబంధం వెదకటం మత పరమైన అంధవిశ్వాసమనే తలుస్తాను" అని వ్రాశారు. గాంధీ ఆయనలేఖను హరిజన్ ప్రచురిస్తూ నేను గురుదేవుల అభిప్రాయాలను ఆయన వ్యక్తిగతమైనవి గా గౌరవిస్తాను. కాని ఆయన నా దృఢమైన అభిప్రాయాని మార్చలేరు అంటారు.
దేవుళ్లకి తుఫానులకి, వర్షాలకి, వరదలకి సంబంధంలేదంటారు ప్రసాద్ - ఆయన దేవుణ్ణి నమ్మక పోయినా నాకు ఇబ్బందిలేదు. ఒక్కసారి భాగవతంలో గోవర్ధన గిరి ఉద్ధరణను గురించి చదివితే ఆయన అనుమానం తీరవచ్చు. పురాణాలు నేను నమ్మను అంటే - ఆయన ఇష్టం.


Nandiraju Radhakrishna మనది సెక్యులర్ మీడియా కాదు. ఫుల్‌గా ఆంధ్రాకుల మీడియా.. ఒకడికే నాలుగు చానళ్ళుంటాయ్. ఒకటి దేవుడిని తిడుతుంది. మరొకటి అచ్చు భక్తిని ప్రవాహం చేసి వీక్ష్గకులమీద కుమ్మరిస్తుంది. మరోకటి బాబాలకు సత్కారాలు చేసి.. శాలువలు కప్పుతుంది. మరొకటి దొంగ బాబాలంటూ ధ్వజమెత్తుతుంది.గుళ్ళలో అక్రమాలంటూ ఏకరువుపెడుతుంది. స్త్రీలను మానంలేనివాళ్ళుగా ఒకటి చిత్రీకరిస్తుంది, అదే పచ్చి వ్యభిచారులను తెరమీదకు తెచ్చి చర్చ పెడుతుంది.. మన టీవీలు ఇవి.. వీటన్నిటికీ వీక్షకులకంటే విశ్లేషకులెక్కువుంటారు. వీరూ ఇదే జాతి ముక్కలు..

Friday, January 19, 2018

నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం PART3 రాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము


https://www.facebook.com/vallury.sarma/posts/506739959363422

https://www.facebook.com/vallury.sarma/posts/507131505990934

https://www.facebook.com/vallury.sarma/posts/507424952628256


మనం వాయువ్యంనుండి, పశ్చిమంనుండి ఇస్లాం మనదేశంలో అడుగుపెట్టినదని తెలుసుకున్నాము. మరి తూర్పున బెంగాల్ లోనికి ఎప్పుడు అడుగుబెట్టినది? నలందా, విక్రమశిలా విశ్వవిద్యాలయాలను ధ్వంసంచేసిన భక్తియార్ ఖిల్జీ ఎవరు? మహమ్మద్ ఘోరీ తరువాత అతడి బానిస, తరువాత అతని సేనాపతి, ఐన ఖుత్బుద్దీన్ ఐబక్ మొదటిసుల్తాన్ అయ్యాడు. అతడి వంశాన్ని ఘులాం (బానిస) వంశం అన్నారు. ఇతని సైన్యాధికారి భక్తియార్ ఖిల్జి. ఆఫ్గనిస్తాన్ లొ స్థిరపడిన ఒక తురుష్క (Turkish) తెగవారు ఖిల్జీలు. అయోధ్యనవాబు అతనిని సేనాపతి చేశాడు. బీహారు తరువాత అతని దృష్టి బెంగాల్ పై పడినది. మొదట నవద్వీపము, (ఇప్పటి నాడియా) తరువాత గౌర్ పట్టణాలను (ఇది గంగా తీరాన ఉన్న గౌడదేశ రాజధాని) అక్రమింఛాడు. (గౌడదేశము అంటే పశ్చిమ బెంగాల్, వంగదేశమంటే తూర్పు బెంగాల్). (గౌడీయ మఠము పేరు ప్రసిద్ధము.) హిందూ ధర్మపరంగా ఆకాలంలో మొదట బీహార్ లోని మిథిలను, తరువాత బెంగాల్ లోని నవద్వీపాన్ని చెప్పుకోవాలి. భారతీయ (హిందూ) న్యాయ, తర్కాలు, బౌద్ధ జైన తర్కాలను అధిగమించి నవ్యన్యాయము అనే కొత్త తర్కాన్ని ఆకాలంలోనే ప్రవేశ పెట్టాయి. మిథిలలో గంగేశ ఉపాధ్యాయుని ప్రమాణతత్త్వ చింతామణి దీనికి మూలగ్రంధం. తరువాత నవద్వీపములోని రఘునాథ శిరోమణి విఖ్యాతుడు. చైతన్య మహాప్రభు మొదట తర్కాన్ని నవద్వీపంలోనే అభ్యసించాడు. ఇస్లాం పరంగా బెంగాలీలలో అధిక సంఖ్యాకులను ముస్లిములుగా మార్చిన ఘనత భక్తియార్ ఖిల్జీదే. అల్ మహ్మద్ అనే బంగ్లాదేశకవి 1990లలో "భక్తియారేర్ ఘోడే " (భక్తియార్ అశ్వాలు) అనే తన కావ్యంలో బంగభూమిపై ఇస్లాం విజయాన్ని కీర్తించాడు. 13వ శతాబ్దంలో ఈ సంఘటన 1905లో కర్జన్ చేత బెంగాల్ మొదటి విభజనకు, 1947లో తూర్పు పాకిస్తాన్ వేర్పాటుకు, 1971 లో బంగ్లా అనే మరొక ముస్లిం దేశపు జన్మకు కారణమైంది. చైతన్య మహాప్రభు(1486-1534) తన కృష్ణభక్తి మార్గంతో బెంగాల్లో ఇస్లాం ఉప్పెనను కొంత వరకు ఎదుర్కొన్నాడు. వాయువ్య దిశన అరబిక్, పారశీక భాషలూ, ఇక్కడ పుట్టిన ఉర్దూ కలసి ఏర్పడిన మిశ్రమ భాష వాయువ్య రాష్ట్రాలనుండి బీహార్ వరకు పనికి వచ్చింది. బెంగాల్ లో పనికిరాలేదు. మతం మీద మమకారం తూర్పు పాకిస్తాన్ గా రూపు దిద్దుకుంటే, భాష పై మమకారం బంగ్లాదేశాన్ని సృష్టించింది.
ఈ చరిత్ర ఎందుకు చదవాలి? ఆనాటి బెంగాల్ లో ఇస్లాం ప్రచారంకావడానికి, నేటి అంధ్రలో క్రైస్తవానికి ప్రచారం రావడానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆనాటి భక్తియార్ అశ్వాలు, నేటి అమెరికా డాలర్లుగా మారిఉండవచ్చును. మతం, పౌరసత్వం, సంస్కృతి, భాష ఇవన్నీ జేబులో పెట్టుకునే ఆధారప్రమాణాలు (ID Cards) కావు. ఈ దినం భక్తితో పూజించిన విగ్రహాలను మరునాడు పనికి మాలినవి గా నిర్ణయించుకోవడం, తిరుపతిలో పవిత్రతను మక్కాకో, బెథెల్ హాంకో మార్చుకోవడం వెనుక కొంత ఘర్షణ ఉంటుంది. అమెరికా పౌరసత్వం తీసికొని, అమెరికా వెళ్ళడానికి పనికివచ్చిన భారత పాస్ పోర్ట్ ని జ్ఞాపిక గా చేసుకోవడం అలాంటిదే. చిన్నప్పుడు చదివిన "చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ" గుర్తుకు తెచ్చుకుంటూ, మనుమరాలో. మనుమడో చదువుతున్న " Solomon Grundy, Born on a Monday, Christened on Tuesday,.. Buried on a Sunday" విని ఆనందిస్తున్నట్లు నటించడం కష్టమే.

Nandiraju Radhakrishna "అమెరికా పౌరసత్వం తీసికొని, అమెరికా వెళ్ళడానికి పనికివచ్చిన భారత పాస్ పోర్ట్ ని జ్ఞాపిక గా చేసుకోవడం అలాంటిదే.....ఈ చరిత్ర ఎందుకు చదవాలి?" అద్భుతంగా చెప్పారు. అసలు ఇవి చదివేందుకు ఎంతమందికి ఆసక్తి ఉంది సార్? ఆసక్తి వున్నా అసలు తెలిసిన వాళ్లేరీ చెప్పేవాళ్లేరీ? ధన్యులం.P Mallikarjuna Rao Well said Sarma garu. Many are converting for the sops they offer and a few show caste as a reason for this conversion. This lot is more dangerous than the former. Further, as Gurugi said on some occasion, the muslims targeted the body while the Christians, the soul. Hence establishment of schools and hospitals.


మన నాటి, నేటి చరిత్రల పునశ్చరణలో "సృష్టి" వలెనే, చరిత్ర కూడా పునరావృత్తం అవుతుందని తెలుసుకున్నాం. అది గమనించకపోతే కలిగే నష్టాలను, నేటి పరిస్థితులనూ పోలుస్తూ ముందుకు సాగుతున్నాము. ఢిల్లీ సుల్తానులవద్ద ఢిల్లీని వదలి దక్షిణ భారతానికి వద్దాం. మన చరిత్ర పుస్తకాలు పట్టించుకోని భాగాలలో ఇది ఒకటి. ఇంత కంటే అన్యాయం, ఈశాన్య భారతం చరిత్ర. సిక్కిం, అరుణాచల్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం గురించి సగటు భారతీయునికి ఏమీ తెలియదు అనే చెప్పాలి. కాశ్మీర్ వివాదం గురించి, కార్గిల్ యుద్ధంగురించి తెలియవచ్చును గాని సనాతన ధర్మంలో కాశ్మీరుకు ఉన్న స్థానం గురించి తెలియక పోవచ్చును.కాని జమ్మూ సమీపంలోని వైష్ణోదేవి ఆలయం ప్రసిద్ధము.ఇంకా కొందరు అమర్ నాథ్ గుహలోని మంచులింగమును కూడా చూసి ఉండవచ్చును.
దక్షిణభారత చరిత్రలో సనాతనధర్మ పరంగా గుర్తుంచుకోవలసిన మొదటి వ్యక్తి ఆదిశంకరాచార్యుడు. బౌద్ధ, జైనాలు వ్యాపించిన దక్షిణభారతంలో సనాతన ధర్మాన్ని పున: ప్రతిష్ఠించిన వ్యక్తి. బుద్ధుడు "దు:ఖానికి కారణం కోరికలు" అంటే కోరికలకు కారణమేమని ప్రశ్నించాడు. "విశ్వం పశ్యతి కార్య కారణతయా .." అని వర్ణిస్తూ కోరికలకు కూడా కారణం ఉంటుందనిచెప్పారు (అవి జన్మతః సంక్రమించిన సంస్కారాలు). మళ్ళీ ప్రపంచాన్ని "విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం" అని వ్యావహారిక సత్యంగా గోచరించే జగత్తును గురించి చెప్పారు. "అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం" అని నమస్కరిస్తూ గీతకు , ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకూ భాష్యాలు వ్రాశారు.భజగోవిందం భజగోవిందం గోవిందమ్ భజ మూఢమతే అంటూ నారాయణ నామ స్మరణనూ, కృష్ణ పరమాత్మకు శరణాగతిని బోధించారు. నేటి కేరళలో పెరియార్ (పూర్ణా) నదీ తీరాన కొచ్చి, ఆల్వేయి సమీపంలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఈ ద్రావిడ శిశువు 32 సం. జీవితకాలం లోపలనే కాశ్మీరు, నేపాలు తో సహా భారతదేశమంతా కాలినడకన తిరిగి ద్వారక, శృంగేరి, జ్యోతిర్మఠ్, పురీలలో అద్వైతబోధకు శంకరమఠాలను స్థాపించి కృష్ణుని తరువాత తిరిగి జగద్గురువైనారు. కేవలం తర్క, వాద పటిమ వలననే వారు జైనులనూ, బౌద్ధులను, మీమాంసికులను ఓడించగలిగారు. ఈయన బోధించిన అద్వైతానికి మూలం ఈయన పరమ గురువు గౌడపాదాచార్యుని మాండూక్యకారికలు. నర్మద సమీపంలో తన గురువైన గోవిందపాదుని కలుసుకొని ఆయన వద్ద మాండుక్య కారికలు గ్రహించారు. కాశ్మీరు శ్రీనగరంలో దాల్ సరస్సుకు ఎదుట గల శంకారాఛార్య గిరి పై మొదటి శివాలయాన్ని నిర్మించారు. (1987లో నాకు దర్శించే అదృష్టం కలిగినది)
మన భారత దేశంలోని నేటి పరిస్థితుల మూలాలు శతాబ్దాల, లేదా సహస్రాబ్దాల క్రితం జరిగిన సంఘటనలపై అధారపడి ఉండవచ్చు. 1950 లో We, the people of India వ్రాసుకున్న రాజ్యాంగం, దాని ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాలు, మన అసలు సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కరించడంలోను విఫలమయ్యాయని చెప్పవచ్చును. 20 వ శతాబ్దపు నూతన సమస్యలు, 1947 భారత దేశ విభజన, 1956 భాషా రాష్ట్రాలు, 1962 చైనాయుద్ధం తెచ్చిన నూతన సమస్యలు, 1971 పాకిస్తాన్ విభజన, నానాటికీ పెరిగి దేశానికి నూతన గుర్తింపు తెస్తున్న అవినీతి ప్రకరణం, "గరీబీ హటావో" లాంటి ఎన్నికల ప్రచార మంత్రాలతో పారిపోని బీదరికం, భారతీయతను విస్మరిస్తున్న మధ్య తరగతి ప్రజానీకం, దేశాన్ని దోచుకుంటున్న నేతలు .. ఇవన్నిటి మధ్య అదనంగా సృష్టించుకొని రాష్ట్రాన్ని వెనుకకు నడిపిస్తున్న రాష్ట్రవిభజన వంటి హాస్యాస్పద ఉద్యమాలు - మన దేశం ఏ సమస్యనూ పరిష్కరించుకోలేదన్న సత్యాన్ని పదేపదే ఋజువుచేస్తాయి. ఒక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రముగా చేయడానికి యజ్ఞాలు, హోమాలు చేయడం, నాయకులు కాని సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలూ మన ధర్మచ్యుతిని చెప్పకనే చెబుతున్నాయి. మత మార్పిడులు మతాన్నీ దేవుణ్ణీ అంగట్లో సరుకులు గా మారుస్తున్నాయి.

Nandiraju Radhakrishna "1950 లో We, the people of India వ్రాసుకున్న రాజ్యాంగం, దాని ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాలు, మన అసలు సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కరించడంలోను విఫలమయ్యాయని చెప్పవచ్చును."---- మన అసలు సమస్యలను నేలమాళిగలొ పూడ్చిపెట్టి వాటిని అవసరమైనప్పుడు పైకితెచ్చి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో ప్రభుత్వాలన్నీ విజయవంతమయ్యాయి. సంబంధం లేని అంశాలతొ ముడిపెట్టి సామాన్యులు, బీద బిక్కి ఆత్మహత్యలు చేసుకున్నారని అసత్య ప్రచారం చేసి ప్రజలను కనికట్టు చేయడంలో ప్రసార సాధనాలు తమకు తాము తాకట్టు పెట్టుకుని వందిమాగద బృందాలై డబ్బుకులోకం దాసోహమంటున్నాయిరాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము 
మన చరిత్ర పుస్తకాలలో లో రాజరాజ నరేంద్రుని పేరు కనిపించదు. ఉత్తరభారతంలో ఘజనీ మహమ్మదు 17 పర్యాయములు దండెత్తి ముఖ్యదేవాలయాలు విధ్వంసం చేసే సమయంలో దక్షిణభారతంలో సనాతన ధర్మ ప్రతిష్ఠాపన జరుగుతూంది. ఆది శంకరుల అడుగుజాడలలో, దేశభాషలకు ప్రచారమిచ్చిన బౌద్ధ జైనాలకు దీటుగా, సనాతన ధర్మ గ్రంధాలను దేశభాషలలోనికి తీసుకొని రావలసిన అవసరం వచ్చింది.వేంగి దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు, రాజరాజ నరేంద్రునిచేత (సా.శ.1019–1061) ఆ కార్యక్రమం ప్రారంభింపబడినది. రాజమండ్రి అనే రాజమహేంద్రవరాన్ని స్థాపించి, పాలించినవాడాయన. తన మంత్రి, గురువు ఐన నన్నయ భట్టారకుని పిలిచి లక్ష శ్లోకాల సంస్కృతభారతమును తెనిగించమని కోరాడు. నన్నయ జన్మస్థలం తణుకు అని చెబుతారు. ఆయన భారతాంధ్రీకరణం మొదలుపెట్టి తన జీవిత కాలంలో ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని అనువదింఛాడు.
1. కావ్యారంభం
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. అవిహితమైన స్త్రీ, పురుష యోగోద్భవమైన లోకముల స్థితి వారు కలిగించుచున్నారు. వేదస్వరూపులు, దేవతాపూజ్యులు, పురుషోత్తములు, అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. -- మహాభారతాంధ్రీకరణలో మొదటిగా నన్నయ చెప్పిన సంస్కృత శ్లోకం ఇది. తెలుగు సాహిత్యానికి శ్రీకారం.
2. మహా భారత ప్రాశస్త్యం
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు
3. సభలో ఎలా మాట్లాడాలి?
మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్
తెలుగు మహాభారతం ఆంధ్రదేశమంతా బహుళ ప్రచారం పొందినది. "వింటే భారతం వినాలి" అనిపించింది. నేటి వరకు దీనిని మించినదిలేదు. గత వేయి సంవత్సరాలలో అభివృద్ధిచెందిన తెలుగు భాషకు, దానికి కారణమైన ఆంధ్రమహాభారత గ్రంధానికీ నిరాదరణ వస్తుందా? అనే అనుమానం 21వ శతాబ్దపు భారతదేశ లక్షణం. ఇప్పుడు 25-45 సం. వయస్సులోనివారు ఎందరికి కవిత్రయం భారతంతో పరిచయంఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, నన్నయగారి శిలా ప్రతిమ కంటే ముఖ్యం. 5000 ఏళ్ళనాటి మహాభారతగాధను తెలుగు భారతం సామాన్యులకు అందించింది. దేశమంతా రామాయణము ప్రసిద్ధము,లోకప్రియము. కేవలము ఆంధ్రులకు భారతం అత్యంత ప్రియమైన గ్రంధం. 21వ శతాబ్దంలో భారతాన్ని చదువుకుంటే, శ్రీకృష్ణుని పూజిస్తే, భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని రక్షించుకోగలము. మహాభారతానికి, భారతదేశానికి మధ్య ఉన్నది అవినాభావ సంబంధం.




నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం అన్న శీర్షికలో

https://www.facebook.com/vallury.sarma/posts/504722689565149

https://www.facebook.com/vallury.sarma/posts/505032042867547


నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం అన్న శీర్షికలో, నేను వేసిన ప్రశ్నలను విశదీకరించమని మిత్రులు ఆచార్య కవన శర్మ గారి సలహా.
మొదటి ప్రశ్న - ఆనాడు ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు జైన, బౌద్ధ మతాల వైపు ఆకర్షితులయ్యారు?
రెండవ ప్రశ్న- నేటి క్రైస్తవ మతం సమాజంలో అట్టడుగు వర్గాలను మొదట ఆకర్షించింది. దీనికి, దానికి భేదమేమిటి?
వారు ఒక మూడవ ప్రశ్నను కూడా వేశారు. ఇప్పుడు బౌద్ధం ఉన్నతవర్గాల కంటె దళిత వర్గాల ప్రజలను ఎందుకు ఆకర్షిస్తూంది? బౌద్ధ మతం, కొందరు ఆధునిక చరిత్ర కారులు చెప్పినట్లు, బలహీన వర్గాలను ఆకర్షించే లక్షణములు కలిగి ఉందా?
నేటి భారతదేశంలో 20వ శతాబ్దపు మొదటిభాగములో అస్పృశ్యతనుగురించి ప్రజలలో చైతన్యము వచ్చినది. మహాత్మా గాంధీ అస్పృశ్యతను రాజకీయాలలోనికి తెచ్చిన మొదటినాయకుడు. ఆయన హిందూ మతస్తుడే అయినా జైన, వైష్ణవ సాంప్రదాయములో ఉన్నవాడు. ఈరెండు శాఖలు అస్పృశ్యతనుగురించి వర్ణాభేదాలనుగురించి ఆలోచించినవే. తరువాత కాలంలో అస్పృశ్యులుగా పరిగణించే మహార్ కులములో జన్మించిన భారతరత్న భీమరావు అంబేద్కర్ బౌద్ధమతము గురించి లోతుగా అధ్యయనం చేశారు. ఆయన చాలా రోజులు హిందూమతాన్ని వదలాలని ఆలోచించి ఇతరమతాలను అధ్యయనం చేసారు. విద్యాధికుడు, హేతుబద్ధముగా ఆలోచించగలవాడు ఐన ఆయన సహజంగా ఆనాడు మేధావి వర్గం ఆకర్షితులైనట్లే బౌద్ధమతమే, భారతీయము, తర్కానికి నిలిచేదీ ఐన మతమని నిర్ణయానికి వచ్చారు. 1956లో తన మరణానికి రెండు నెలల ముందు 1956లో 5 లక్షల దళిత అనుయాయులతో పాటు బౌద్ధమతము స్వీకరించారు. ఆయన "Who were the Shudras? - How they came to be the Fourth Varna in the Indo-Aryan Society" "శూద్రులు ఎవరు? ఎందుకు వారు భారతీయ ఆర్యసమాజములో నాలుగవ వర్ణముగా ఎందుకు పరిగణింపబడ్డారు?" అనే తన 1946లో ప్రచురింపబడిన పుస్తకములో తన కులమైన మహర్లు పూర్వము బౌద్ధులనీ, ఆమతమును వదలుకొనుటకు ఇష్టములేక హిందూ సమాజమునకు విడిగా జీవించారనే వాదనను ప్రతిపాదించారు. నాకు anthropological studies తో పరిచయంలేదు. అందుచేత ఆయన ప్రమేయాన్ని స్వీకరిస్తాను. (నిజానికి ఆయన కులస్తులు అంత వెనుకబడినవారు కాదు. శివాజీ సైన్యములో సిపాయిలుగా పనిచేసినవారు. భారత సైన్యములోకూడా మహర్ రెజిమెంట్ ఉంది. మధ్య యుగాలలో మహర్లలో హిందూ స్వాములు ఉన్నారు. 1900 ఇంపీరీల్ గెజెటీర్ లో గ్రామీణ ప్రాంతాలలో కొంత అస్పృశ్యత ఉన్నా, నగర ప్రాంతాలలో వారు భాగ్యవంతులైనారని ఉన్నది.) ఇండియాలో బౌద్ధమతము పునరుజ్జీవనానికి ఆద్యుడు అంబేద్కర్ కాదు. ఆనాడు అశోకుడు తన పిల్లలను సింహళానికి పంపి బౌద్ధ మతాన్ని వ్యాప్తిచేస్తే 1891లో అనాగరిక ధర్మపాల అనే సింహళమునుండి వచ్చిన బౌద్ధ సన్యాసి మహాబోధి సొసైటీ ని స్థాపించాడు. ఇక్కడ కూడా కొందరు అగ్రవర్ణాలవారే మళ్ళీ బౌద్ధాన్ని స్వీకరించారు. 1890 ప్రాంతాలలోనె పండిత అయోధ్యదాస అనే తమిళదేశ సిద్ధవైద్యుడు Indian Buddhist Associationను స్థాపించాడు. అతడే తమిళదేశములోని వెనుకబడిన వర్ణాలవారు మొదట బౌద్ధులనీ, శైవ, వైష్ణవాలు తిరిగి ప్రాముఖ్యత పొందడంతో బౌద్ధులను అస్పృశ్యులుగా చేశారని వాదించాడు. సింహళానికే వెళ్ళి బౌద్ధం స్వీకరించాడు. ఇక్కడ ఇంకా గమనించవలసిన విశేషాలున్నాయి. రేపు చూద్దాం. ముఖ్యంగా ఆర్య ద్రావిడ వాదం, మత మార్పిడులు, బౌద్ధ క్రైస్తవ మత ప్రచారం, దళితవాదం ఇవన్నీ 20వ శతాబ్దములో సామాజిక రాజకీయ వ్యవస్థలలో పాలు పంచుకున్నాయి.


20వ శతాబ్దంలో భారతదేశంలో ముఖ్యంగా బౌద్ధమతము గురించి చర్చించాలంటే కొందరు ముఖ్య వ్యక్తులను గురించి మాట్లాడుకోవాలి. రాజకీయ నాయకులలో దలైలామా, అంబేద్కర్, నెహ్రూ, చరిత్రకారులలో కోశాంబి, విశ్వవిద్యాలయ ఆచార్యులలో ఐలయ్య ప్రసక్తి వస్తుంది.
1. దలైలామా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు, పాలకుడు కూడా. కరుణామయుడైన బోధిసత్త్వుడు, అవలోకితేశ్వరుని అవతారమని టిబెటన్లు భావిస్తారు. ప్రస్తుత 14వ దలైలామా 1950లో పదవినిచేపట్టారు. 1951లో చైనా టిబెట్ పై దాడిచేసి సంపూర్ణ సార్వభౌమ అధికారం పొంది ఒక ఒడంబడికకు వచ్చింది. 1959 వరకు చైనాతో ఒకలాగ నెట్టుకు వచ్చినా 1959లో ప్రాణభయంతో తన అనుయాయులతో భారత్ కు శరణార్థిగా వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో స్థానం ఏర్పరచుకొన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన టిబెటన్ బౌద్ధ మతగురువుగా ఆయన మాటలు బౌద్ధానికి ప్రమాణంగా తీసుకోవచ్చును. అహింస, మధ్యేమార్గము ప్రధానంగా కల ఆయన బౌద్ధమార్గము, మార్క్సిస్టు, మావోయిస్టు, హింసాకాండల ప్రతినిధియైన చైనాతో తలపడి తన ఆశయాలు సాధించుకునే అవకాశం కనపడదు. ఇది బౌద్ధం బలహీనత. హిందూమతమున్నంతవరకే బౌద్ధం భారత దేశంలో కూడా మనగలదు. దక్షిణకొరియాలో 1960-1990 మధ్యకాలంలో క్రైస్తవమతం బౌద్ధాన్ని తుడిచిపెట్టి వేసింది.
2. ప్రతిభ, పాండిత్యము, Scholarship, తార్కిక శక్తి ఈ విషయాలలో పోలిస్తే అంబేద్కర్ - గాంధీ, నెహ్రూలకంటె ఎన్నోరెట్లు ప్రతిభావంతుడు. అందుకే బహుశా అంబేద్కర్ వాళ్ళతో పడలేకపోయాడు. నా మూల్యాంకనం వారి గ్రంధాల పరిశీలన పై ఆధారపడింది. అవి గాంధీ - The story of my experiments with truth నెహ్రూ - Autobiography, Discovery of India అంబేద్కర్ - Buddha and his Dhamma. నెహ్రూ తనని గురించి తాను ఇలా చెప్పుకుంటాడు – “English by education, Muslim by culture and Hindu by birth. .. I have become a queer mixture of the East and the West, out of place everywhere, at home nowhere.” All roads led him to Rome.
3. దామోదర్ ధర్మానంద్ కోశాంబి (1907-1966) బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆయన పేరు గల గణిత శాస్త్రవేత్త, సంఖ్యా శాస్త్రవేత్త, మార్క్స్ వాది, చరిత్రకారుడు, సంస్కృత, పాలీ భాషలు తెలిసినవాడు.ఆయన తండ్రికూడా ప్రాచీన బౌద్ధ సాహిత్యము అభ్యసించినవాడు. ఈయన దృష్టిలో బౌద్ధమతము సమాజ రాజకీయ పరముగా కూడా విలువైన మార్గము. Buddha is a social reformer rather than a prophet or incarnation of God.
4. కంచె ఐలయ్య (1952-) ఉస్మానియాలో రాజకీయ శాస్త్ర ఆచార్యుడుగా పదవీవిరమణ చేశాడు. ఈయన పుస్తకం ఆయన సిద్ధాంతవ్యాసం పై ఆధార పడినది. దాని శీర్షిక God as political philosopher: Buddha's Challenge to Brahmanism. ఆయన ధ్యేయం హిందూమతానంతర భారతదేశం. శత్రువులు హిందూమతము, బ్రాహ్మణ కులము. ఆయన పాండిత్య ప్రకర్ష ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రస్తుత స్థాయికి సూచిక.
రాజకీయాల పైన సమాజముపైన బౌద్ధమతం దృష్టికోణం తెలుసుకోవాలంటే దలైలామా అభిప్రాయాలను ప్రమాణంగా స్వీకరించ వచ్చును. ఆయన దృష్టిలో అందరుప్రజలను సమానముగా చూచే మతప్రసక్తి రహిత ప్రజాప్రభుత్వమే శ్రేష్ఠమైనది. ప్రపంచముతో సంబంధములేకుండా, ప్రపంచంలో వస్తున్న పరిణామాలను గుర్తించకుండా, తమ ధర్మా చరణంలో తాము నిమగ్నులై ఉండటంవలననే టిబెట్ కు ప్రస్తుత దయనీయ పరిస్థితి వచ్చినదని ఆయన చెబుతారు. బుద్ధుడు చూపిన మార్గము ఇప్పటి వైవిధ్యముగల ప్రపంచములో శాంతి సాధనకు ఉపకరిస్తుందని, అది అందరు ప్రజలకు, దేశాలకు వర్తిస్తుందని ఆయన బోధ.
మార్క్స్ వాదులైన చరిత్రకారుల రచనలను నేను గుర్తించను. అందులో మార్క్స్ వాదము, బౌద్ధమతానికి అసలు పనికిరాదు. నా సిద్ధాంతం బౌద్ధ జైనాలు హిందువుల కంటె ప్రభావము కలిగిన తర్కము చేయడం వలననే గౌతమ న్యాయంపై ఆధార పడిన వైదికధర్మం పై విజయం సాధించి, పండితవర్గాన్ని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ఆకర్షించ గలిగారు. శబ్దము వైదిక మతానికి ప్రమాణము. కాని బౌద్ధులకు కాదు. ఋషిప్రోక్తములైన వేదములు ప్రమాణము కాకపోతే, మార్క్స్ ప్రోక్తమైన డాస్ కాపిటల్ ఎలా ప్రమాణమౌతున్నది? “మార్క్స్ ఇలా అన్నాడు” అని ఒక మాట అంటే వారు వాదంలో ఓడిపోయినట్లే. నిజానికి ఇది గ్రీక్ లాజిక్ లోకూడా హేత్వాభాసయే (Fallacy called argumentum ad verecundiam, argument quoting authority). గణిత శాస్త్రజ్ఞులు మతములకు అవసరమైన తర్కం చేయలేరు ఎందుకంటే అక్కడ ఉపయోగించేది Deductive Logic. అది భౌతిక ప్రపంచానికి సరిపోదు. కోశాంబి, మార్క్స్ వాదులను అనుసరించిన ఐలయ్య వంటివారి వాదనలు హేతుబద్ధం కాదు.
అందుచేత నిమ్నకులాల ప్రజలు బౌద్ధానికి ఆకర్షితులయ్యారు, అవుతున్నారు అనే వాదనకు మనం అంబేద్కర్ రచననే ప్రమాణంగా స్వీకరించాలి. ఆయన పుస్తకం "బుద్ధుడు ఆయన ధర్మము" అద్భుతమైన పుస్తకం. అంబేద్కర్ తనపుస్తకమును సామాన్య ప్రజలకు అర్థమయ్యేభాషలో,వారికి వచ్చే అనుమానాలను నివృత్తిచేసే విధంగా, తత్త్వశాస్త్ర పరిభాషలేకుండా వ్రాశారు.ఆ పుస్తకములోని విషయాలు ఇవి - 1. సిద్ధార్థ గౌతముని ప్రయాణం - బోధిసత్త్వుని నుంది బుద్ధుని వరకు, జ్ఞానోదయం 2. మార్గము బోధిస్తూ తన మార్గములోనికి తెచ్చుకోనుట (Campaign of Conversion)- బ్రాహ్మణులు, క్షత్రియులు, ధనవంతులు, సన్యాసులు, సామాన్యులు, నిమ్న వర్గాలు, స్త్రీలు, దోపిడిదొంగల వంటి వారు - ఆయన మార్గమునకు అందరూ అర్హులే 3. బోధలు 4. ధర్మము, సద్ధర్మము, మతము 5. సంఘము 6. సమకాలికులు మిత్రులు, శత్రువులు, విమర్శకులు, సమర్ధకులు 7. నిర్వాణము 8. బుద్ధుని వ్యక్తిత్వము. అంబేద్కర్ బౌద్ధమతముతో ఆకర్షితుడైనది బుద్ధుని హేతుబద్ధమైన వాదనలు, బోధలకే. ఆయన అనుయాయులైన నిమ్న జాతులు అంబేద్కరుయొక్క మార్గమును అనుసరించారు అంతే. బౌద్ధమతములో వారిశాఖ హీన యానమా, మహా యానమా, వజ్ర యానమా అంటే ఇప్పటికి రాజకీయాలకు సరిపోయిన నవ యానము అని చెప్పాలి.

P Mallikarjuna Rao Sir the dalits join Buddhism today not because they find Buddha's philosophy more sound than Hinduism. The only fact that lures them is that the Buddha does not accept caste. They join Buddhism because Dr. Ambedkar did. They hardly know anything about Buddhist philosophy or thought. This is what I have learned from my interaction with them. In fact many Buddhist monks are not happy with them.
Vijayalakshmi Mandalaparthy Another important thing is Buddhism is for total abstinence from non-veg! Something which these neo-Buddhists don't care to follow! If Buddhism achieves even that one thing then it is worth it, but no!
Vvs Sarma Most Dalit Buddhists do not know anything about Buddhism They joined following Dr Ambedkar My point is he analysed the options available to him and joined Buddhism. In fact he did not study Hinduism that deeply. He only had opinions about the society and the treatment his community has got in Indian, majority Hindu society even compared to Muslims and Christians.
P Mallikarjuna Rao Not all Buddhists are meat-eaters. Many South-East Asians are vegetarians. Buddhists advance two reasons for eating meat. 1. A bikshu has no choice regarding his biksha. He should accept whatever food he is offered. He can not demand a house holder only for vegetarian food. 2. Where there is no food other than meat available, a bikshu can eat non-vegetarian food. That's the reason for the Tibetans eating meat.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...