Showing posts with label శైవం. Show all posts
Showing posts with label శైవం. Show all posts

Sunday, January 21, 2018

శైవమతం ఎట్లా సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది..!!!

https://www.facebook.com/vallury.sarma/posts/511255965578488

ప్రియ భగవత్ బందు శ్రీ శర్మ గారు,
జై శ్రీమన్నారాయణ,
మిత్రులు బహుజనబందు ఈ విధంగా వ్రాసారు.
"శైవమతం ఎట్లా సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది..!!!
మానవ సమాజాలు ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు పరిణామం చెందిన తరువాత నదీ పరివాహక ప్రాంతాలలో స్థిర నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయ నాగరిక వ్యవస్థలు నిర్మించుకున్నారు. నైలు, చిలీ, తిగ్రీస్, సింధూ నదుల పరివాహక ప్రాంతాలలో ఏర్పడిన తొలి నాగరికతలలో సింధు నాగరికత ఒకటి. అప్పటికి ఇంకా ఆహార ఉత్పత్తి దశకు ఎదగని మానవ సమూహాలు స్థిర నాగరిక సమాజాల మీద ...దాడులు చేస్తూ వారి ఉత్పత్తులను, సంపదను దోచుకుంటూ అటవిక సంచార జీవనం సాగిస్తూ ఉన్నారు.
సింధూ ప్రజలు ఆహారాన్ని వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారంటేనే, ఉత్పత్తి క్రమాన్ని, మానవ పునరుత్పత్తిని పూర్తిగా అర్ధం చేసుకున్నారని అర్ధం. వారు ఉత్పత్తికి ఉపయోగపడే భౌతిక వస్తువులైన భూమి, నాగలి, ఇతర పనిముట్లు ఆరాధించారు.
మానవ జాతి మనుగడకు మానవ పునరుత్పత్తి ప్రధానం కనుక పునరుత్పత్తికి కారణమౌతున్న, 'స్త్రీ-పురుష' పునరుత్పత్తి అవయవాల కలయికను గౌరవిస్తూ, సృష్టి కార్యంగా భావిస్తూ. దాన్నే దైవంగా ఆరాధిస్తూ తమ దైవాన్ని లింగ రూపంలో దర్శించుకుంటూ ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని ఏర్పరచుకున్నారు. వారి జీవన విధానమే శైవమతం. శివలింగానికి కూడా మానవాకారం లేదు. ఈ రోజు మనం శివాలయాలలో చూస్తున్న లింగం వాస్తవానికి ఒక్క లింగం కాదు. రెండు లింగాల కలయిక. కింద స్త్రీ లింగం అంటే పానపట్టంభగ, దాని మధ్యలో పురుష లింగం అంటే ప్రతీకాత్మక ద్విలింగైక్యం.ఇది సృష్టికి సంబంధించి ప్రకృతికి సహజత్వానికి చాలా దగ్గరలో ఉండే తాత్విక భావన. అందుకే శైవమతం సింథు ప్రజల/ మూలవాసుల వారసత్వం అయింది..@ బహుజన బంధు."
పై లఘు వ్యాసము లోని శివలింగ, పానపట్టము విషయాలు వదిలి, మిగిలిన చారిత్రాత్మక విషయాల వాస్తవికత తెలుపవలసినది.

శైవం, వీరశైవం



https://www.facebook.com/vallury.sarma/posts/509302145773870

ఆంధ్రదేశ చరిత్రలో ప్రజలు జైనాన్ని, బౌద్ధాన్ని వదలి హిందూమతానికి తిరిగి వచ్చిన కాలంలో ఎక్కువగా శైవం ప్రసక్తి వస్తుంది. ఆంధ్రదేశంలో శంకరాద్వైతానికి ఉన్న ప్రచారం శైవ, వైష్ణవాలకు లేదు అనిపిస్తుంది. శంకరాచార్యుడు రూపంలో శైవుడు. భక్తిలో వైష్ణవుడు. ఉపాసనలో శాక్తేయుడు. "శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే." తెలుగు ప్రజల సామాన్య అభిమతం. శైవం సనాతన ధర్మంలో ఒక ప్రాచీన సాంప్రదాయం. వైష్ణవం అర్వాచీనమని, దర్శనముల వరసలో రామానుజ పూర్ణప్రజ్ఞ దర్శనాల కంటె శైవ దర్శనాలు ఉత్తమములని సర్వదర్శన సంగ్రహ కారుని అభిమతం. శైవంలో నకులీశ పాశుపతం, శివాద్వైతం, ప్రత్యభిజ్ఞ దర్శనం (కాశ్మీర శైవం) వైదికమతాలు. కాపాలికులు, కాలముఖులు అనుసరించే శైవం అవైదికమని రామానుజులు తన బ్రహ్మసూత్రభాష్యంలోచెప్పారు. సామాన్యులకు శైవంపై అవగాహన తక్కువ. శైవం తమిళదేశంనుండి, కాశ్మీరం వరకు వ్యాపించినమతం. వేదం అందరు దేవతలను స్తుతించింది. యజ్ఞాన్నిధర్మంగా చెప్పింది. "యజ్ఞోవై విష్ణు" అని యజ్ఞమును విష్ణుస్వరూపముగా చెప్పినది. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, దుర్గ, విష్ణువు, రుద్రుడు, ఇలా అందరు దేవతలను యజించి యజ్ఞంలో స్వాహాకారంతో ఆహూతులు ఇవ్వడం పద్ధతి. అక్కడ ఎక్కువతక్కువలు లేవు. కాని దేవలోకంలోనే శివుడు లేనియజ్ఞం దక్ష ప్రజాపతి సంకల్పించాడు. దానిని వీరభద్రుడు నాశనంచేస్తూంటే విష్ణువుకూడా ఏమీచేయలేకపోయాడు. శివ పారమ్యము, శివద్వేషము - ఈ రెండిటిమూలాలు దక్షయజ్ఞం నాటివి. వీర శైవములో ముగ్గురు సిద్ధులను పేర్కొంటారు. వారు రేవణ సిద్ధుడు. మరుళసిద్ధుడు. ఏకోరామ సిద్ధుడు. రేవణసిద్ధునే జగద్గురు రేణుకాచార్యుడని కూడా అంటారు. ఆయన అగస్త్యమహర్షికి ఉపదేశంచేశారనీ, అగస్త్య మహర్షిద్వారా శైవం దక్షిణదేశములో ప్రచారమయిందనీ పురాణ కథ. ఈ రేణుకాచార్యుడే జగద్గురు శంకరభగవత్పాదులకు చంద్రమౌళీశ్వరలింగాన్ని ఇచ్చినట్లు ఐతిహ్యం ఉంది.
వైష్ణవులు శరణాగతికీ, దాస భక్తికి ప్రాధాన్యత నిస్తారు. హరిదాసుల గురించి విన్నంతగా శివదాసులను గురించి వినం. శైవులకు దాసోహం అనడం కంటే శివోహం అనేస్థితికి చేరుకోవడం ఇష్టం. సాలోక్యం,సామీప్యం, సారూప్యం కంటె సాయుజ్యం ఇష్టం. ఇది మాత్రం తేలికా, శంకరుడు ఎంత భోళానాధుడైనా? పరాభిమతా ముక్తానభవంతి, పరతంత్రత్వాత్ పారమైశ్వర్య రహితత్త్వాత్ అస్మదాదివత్ ముక్తాత్మానశ్చ పరమేశ్వరగుణసంబంధినః -- వైష్ణవంలో ముక్తులుకూడా విష్ణుదాసులుగా ఉండవలసినదే! ఈ దాసత్వం, పరతంత్రత్వం, పరాధీనత్వం,దుఃఖాన్నే కలిగిస్తాయి మాహేశ్వరులైతే పారమైశ్వర్యాన్నేకోరుకుంటారు. ముక్తులైతే పరమేశ్వరునివలెనే దుఃఖకారణాలులేక పరమేశ్వరగుణసంపన్నులై ఉంటారు అని వాదిస్తూ వీరు పాశుపతశాస్త్రాన్ని ఆశ్రయిస్తారు.పశువులంటే జీవులు, పశుపతి అంటే ఈశ్వరుడు.ఆయన ఇచ్చినది పాశుపత శాస్త్రం. కార్యము, కారణము, యోగము, విధి, దుఃఖాంతము అనే ఐదు పదార్థాలు తత్త్వజ్ఞాన సాధనకు ఉపయోగపడతాయి. మిథ్యా జ్ఞానము, అధర్మము, ఆసక్తిహేతువైన విషయాలు, ధర్మచ్యుతి ఇవి జీవత్వానికి మూలము. జపము, ధ్యానము, ఎల్లప్పుడు రుద్రుని స్మృతి, ప్రవృత్తి (రుద్రునికి శరణాగతి) ఇవి జీవుణ్ణి శివునివైపుకు తీసుకువెళ్టాయి. పశువు, పశుపతి తోబాటుగా పాశాన్ని కూడా స్వీకరిస్తే శైవాగమాలు చెప్పిన శైవదర్శనం వస్తుంది.
శివయోగి శివాచార్యుని సిద్ధాంత శిఖామణి మొదటి శ్లోకం.
త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే,
సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః.
దీని వివరణ శైవ సిద్ధాంత అవగాహనకు తోడ్పడుతుంది.

మల్లికార్జున పండితారాధ్యుడు (క్రీ. శ. 1160 ప్రాంతాలు ) -- శైవం – బౌద్ధం


మల్లికార్జున పండితారాధ్యుడు (క్రీ. శ. 1160 ప్రాంతాలు ) -- శైవం – బౌద్ధం


మల్లికార్జున పండితారాధ్యుని తల్లి గౌరాంబ, తండ్రి భీమన్న, దక్షారామ భీమేశ్వరాలయం ప్రధాన అర్చకుడు. అప్పటికే చాళుక్యభీముడు దక్షారామ భీమేశ్వరాలయం కట్టించి 150 సం. పైన అయింది. మల్లికార్జున పండితారాధ్యుడు స్మార్తుల ఇంట పుట్టి, కోటిపల్లి ఆరాధ్యదేవునివద్ద శివదీక్షతీసుకున్నాడు. శైవ సాహిత్యమంతా ఆకళింపు చేసుకొని నకులీశ పాశుపత దర్శనాన్ని అధ్యయనంచేసి, మల్లికార్జున పండితారాధ్యుడు శతక రచనకు మార్గదర్శకుడై శివతత్త్వసారమనే శతకాన్ని రచించి ప్రథమాంధ్ర శతకకర్తయనే గౌరవము పొందియున్నాడు . ఈ శతకములో కొన్ని వందల పద్యములన్నాయి. ఇందు అజా, మహేశ, శివ, సర్వానంద అనే మకుటములు కానవస్తాయి. పరమేశ్వరుని నిజస్వరూపమును నారాయణుడు, బ్రహ్మ మొదలైనవారే వర్ణించలేనపుడు, నేనెట్లు నిరూపింతునని కవి ఈ విధంగా వచించినాడు.
శ్రీ పతి వాక్పతి ముఖ్య మ
హా పురుషులు నెఱుగ నోప రతి వాఙ్మానస
వ్యాపారమైన నీ నిజ
రూపము నేనెట్టిదని నిరూపింతు శివా.
వీర మహేశ్వర మార్గమును అనుసరిస్తూ శైవ మత ప్రచారానికి దేశ సంచారం ప్రారంభించాడు.
ఆయన దక్షారామం వదలి వెలనాడు ముఖ్య పట్టణం చందవోలుకు వచ్చాడు. అప్పుడు చందవోలు కవి పండితుల నిలయం. అక్కడ రాజ సభపేరు బ్రహ్మ సభ. అక్కడ ఆస్థానంలో ఉన్నది బౌద్ధపాదాచార్యుడని రాజగురువు. బహిరంగ వాదోపవాదాలతో బౌద్ధుని ఓడించారు. ఇంతవరకు ఇది సత్యం. ఈ సంఘటన జరిగినది ఆది శంకరుల అవిర్భావానికి శతాబ్దాల తరువాత. వాదంలో బౌద్ధులు గెలిచే అవకాశమేలేదు. హిందూ తర్కం బౌద్ధతర్కం స్థాయిని ఎప్పుడో మించింది.
కాని కొన్ని కథలు ప్రచారంలోకి వచ్చాయి. వాదంలో ఓడిన తరువాత బౌద్ధుని శిష్యులు ఈయన బృందాన్ని ఆవమానం చేసి, పూజా ద్రవ్యాలను అపహరించారనీ, ఈయన శిష్యులు వాళ్ళమీద తిరగబడి వారిని చంపారనీ, దానికి శిక్షగా ఈయన కన్నులు రాజు పెరికించివేశాడనీ కథలు ప్రచారమయ్యాయి. ఈ కథలను చెబుతూ శైవులు ఆరాజు బౌద్ధుల ప్రొత్సాహం వలననే మల్లికార్జున పండితుని శిక్షింఛాడనీ, దానికి ఆయన రాజుని శపించి అమరావతి వెళ్ళి అమరేశ్వరుని ప్రార్థిస్తే ఆయన కన్నులు తిరిగివచ్చాయనీ చెబుతారు. Miracles గురించిన సత్యాసత్యాలను చరిత్రపరంగా చెప్పలేము. ఇవి మహనీయుల సమక్షంలో జరుగుతాయన్నది సామాన్య విశ్వాసం, లేక కొద్దిమంది సమీపవర్తుల ప్రత్యక్షానుభవం. ఎందుకంటే ఈయన తరువాత చందవోలు వదలి అమరావతి, ఓరుగల్లు, శ్రీశైలం మీదుగా బసవేశ్వరుని కలుసుకోవడానికి కర్ణాటక రాజ్యం వెళ్ళిన సమాచారం సత్యం. ఆయన కర్ణాటక రాజ్యం చేరినప్పటికి బసవేశ్వరుని మరణ వార్త వస్తుంది.
ఈ కథలు ఇప్పుడుకూడా మత రాజకీయాలకు వాడబడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రదేశంలో అంబేద్కర్ అనుయాయులైన కొందరు దళితుల వలన బౌద్ధం ప్రచారంలోనికి వస్తూంది. వారికి ఒక శ్రీలంక బౌద్ధబిక్షువు ఇచ్చే ఉపదేశమిది. మన దేశంలోని మతశక్తులన్నిటిలో విదేశీ శక్తుల హస్తం ఉంటుంది. Ven. Bhikkhu Vinayarakkhita of SRI LANKA writes in his website (BUDDHISM IN ANDHRA PRADESH)
http://www.metta.lk/english/buddhism-ap.htm while writing about the Buddha statue in Hussain Sagar, Hyderabad.
The aggressive and often violent campaign is exemplified by the conduct of the Veera Saiva proponent, Mallikarjuna Panditaradhya, who after losing a debate to Buddhist monk in the court of chandole conspired and got them killed and destroyed their places of worship. Panditaradhya's aggressive campaign almost wiped out Buddhism, in the Andhra country. Earlier Kumarila and Shankara carried on virulent crusade against Buddhism.
నలుగురు శిష్యులతో వాదానికి వెళ్ళిన పండితుడు, ఆస్థానంలోని బౌద్ధమతచార్యుల శిష్యులను చంపి పూజా స్థలాలను విధ్వంసంచేయడం ఊహింపలేని విషయం. ఆయన సేనతో చందవోలు దండయాత్రకు రాలేదు.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...