Thursday, January 25, 2018

గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం…

https://www.facebook.com/vallury.sarma/posts/602280333142717

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి వ్యాసం ఈ రోజు ఆంధ్రభూమిలో
గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం…
- సామవేదం షణ్ముఖశర్మ 25/11/2013 Andhra Bhoomi Daily
శ్రీశ్రీశ్రీ శ్రీ శివానందమూర్తిగారి కారణజన్మబహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది.
1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా, అసంఖ్యాకులను ప్రేరేపించి, వారి జీవితాలను, ధర్మమయంగా, తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం. ... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
మన సనాతన ధర్మం ఆర్షగ్రంథాలపైనా, భవ్యక్షేత్ర తీర్థ దేవాలయాలపైనా ఆధారపడి వర్థిల్ల్లినదే కాదు. ఎందరో మహాత్ముల ద్వారా తేజరిల్లుతున్నది. ఎప్పటికప్పుడు ఆయా దేశ కాలాలకనుగుణంగా యోగులు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. కొన్ని వేల గ్రంథాల వలన తెలియవలసిన జ్ఞానం, కలుగవలసిన ప్రభావం ఒక్కయోగివల్ల జరుగుతుంది. ఒక రమణులు, ఒక కంచి మహాస్వామి... ఇలా ఎందరో జీవన్ముక్తులు సనాతన బ్రహ్మ విద్యకు సాకారంగా సంచరించి ధర్మసౌధాన్నినిలుపగలుగుతున్నారు. వీరే మన పరంపరకు, సంప్రదాయాలకు, అమోఘమైన జ్ఞానానికి ఆధారస్తంభాలు. ఈ సద్గురు పరంపరకు ప్రణామాలు. * * *
చాలా యేళ్ల క్రితం... ఒక స్నేహితుడు రమణమహర్షిగారి అరుదైన ఫొటో ఆల్బమ్ను నాకు చూపించారు. చక్కని సాంకేతిక విజ్ఞానంతో ఏర్పరచిన సమాహారమిది. స్ఫుటమైన రమణుల ప్రశాంత ముఖచిత్రాలు ఎన్నోఅందులో ఉన్నాయి. అయితే ప్రతి చిత్రంలోనూ ఆకళ్లల్లో ఏదో అనిర్వచనీయ తేజస్సు ద్యోతకవౌతోంది. ఇలాంటి నయనాలను ఎక్కడో ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తోంది. అవును- ఒకే ఒక్క వ్యక్తిలో అలాంటి నేత్రజ్యోతి దర్శనమయింది. ఎవరా మహనీయులు- కాసేపట్లో జ్ఞప్తికి వచ్చింది. అలాంటి ప్రకాశవంతమైన, నిర్మల, నిర్వికార, జ్ఞానస్ఫురనేత్రాలు కల గురువర్యులు సద్గురు శివానందమూర్తిగారు. నాడు అరుణాచలంలో స్థాణు చైతన్యం, నేడు భీమునిపట్నపు ఆనందవనంలోనూ, వరంగల్ గురుధామ్లోనూ, కొన్ని ప్రత్యేక సభల్లోనూ, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాత్సల్యంతో సంచరిస్తున్న చైతన్యం! వ్యక్తిగతంగా దర్శించిన, అనుభవించిన దివ్యత్వాలు ఒక గ్రంథానికి సరిపడా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తిత్వంలో స్ఫురించిన సందేశాలను ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తాను. వారి ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రం, మననం చేసే వారిని రక్షించేది. మంత్రం (మననాత్ త్రాయతే మంత్రః) – అని శాస్తన్రిర్వచనం, అందుకే ఆ వాక్యాలు మంత్రాలు. ఈ దేశం పట్ల, దీని సహజ స్వభావమైన ఆర్య ధర్మం పట్ల వారికున్న పరిజ్ఞానం,పరమభక్తి ‘నాన్యతో దర్శనీయం’. నేటి యువత గ్రహించి స్ఫూర్తి చెందవలసిన అంశం. ఆసేతుశీతాచలం భిన్న రాష్ట్రాల వైవిధ్యంలో ఏకసూత్రంగా అల్లుకున్నసనాతనధర్మ వైభవాన్నివారు పర్యటించి, పరిశీలించి, పరిశోధించి గ్రహించి ఉద్బోధిస్తున్నారు. వ్యతిరేక శక్తుల కువిమర్శలను ప్రశాంతంగానూ, పరమ స్పష్టంగానూ, సూటిగాను ఎదుర్కొంటూ వారు పలికిన, రాసిన వాక్యాలు ప్రత్యేక ధర్మశాస్త్రాలు. అపారమైన వాత్సల్యం, కారుణ్యం వారి కనులనుండి వర్షిస్తున్నా, రాగద్వేషాదుల చాయలు కానరావు. ఒక విశాలమైన ఆహ్లాదినీ దృక్కుంతి హృదయాలను స్పర్శిస్తుంది.
ఒకసారి హైదరాబాదు నగరంలో వారిని దర్శించేందుకు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక భావన కలిగింది. ‘‘నిత్యం ఏదో కొంతసేపు మాత్రమే ఉపాసన చేసుకోగలుగుతున్నాను. ఉపన్యాసాలతోనే కాలమైపోతోంది. నేను తరించేదెలా?’’- అనే విచారం మనసునావరించింది. వారిని దర్శించి తీర్థం పుచ్చుకున్నప్పుడు, మనసులో ఉన్న ఈ వేదనను చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను. మౌనంగానే ఉన్నాను. అప్పుడు వారు విబూదిని నా నుదుటరాస్తూ ‘‘నీ ఉపన్యాసమే నీకు ఉపాసన’అన్నారు. ఆశ్చర్యం కలిగింది. మాటాడనవసరం లేకుండా మనసును గ్రహించే మహాదేవ తేజస్సుకి మనసా నమస్కరించుకున్నాను. వారి ఈ మాటలో నాకు గొప్ప సందేశం అందింది. ‘ఉపన్యాసాన్ని ఉపాసనగా సాగించు’అనే ప్రబోధమిది. తరువాత అనేక సందర్భాల్లో ధర్మప్రచారం గురించి కర్తవ్యోన్ముఖులని చేశారు.
‘‘మన సనాతన ధర్మం గురించి ప్రచారంచేయడం ముఖ్య కర్తవ్యం. ఋషులిచ్చిన ధర్మం గురించి ప్రచారం చేయడమనేది ఎన్నోఅశ్వమేధ యాగాలకంటె గొప్పది. యాగం స్వర్గాన్నిస్తుంది- అంతే. ధర్మప్రచారం అంతకంటే గొప్పదైన ఈశ్వర కృపను ప్రసాదిస్తుంది’’అని బోధించారు. ‘ఈ దేశంయొక్క అసలు చరిత్రను తెలుసుకోవాలి.దేశమంతా సంచరించాలి. నాకైతే ఈ దేశపు మట్టిలో దొర్లితేనే ధన్యత అనిపిస్తుంది. అంత పవిత్రమైనదీ దేశం’’. ఈ ఆర్యభూమిపై వారికున్నప్రపత్తి అంతటిది. ధర్మప్రచారానికి, ప్రబోధానికి అంకితమయ్యేలా తీర్చిదిద్దినది వారి ఉపదేశం, ఆదేశం, ఆశీర్వచనం. లౌకికాపేక్షలను జన్మతోనే జయించిన ఆజన్మశుద్ధులు వారు. లోకాన్ని ఒక చిత్తరువులా చూసే నిర్వికారులు, జ్ఞానదృష్టితో సర్వాన్నీ వీక్షించే వారి సన్నిధి ప్రశాంతతను ప్రసాదించడమేకాదు, వారివారి యోగ్యతలననుసరించి కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. నడిపిస్తుంది. మౌనంగానూ, ప్రభావవంతంగానూ వారందించే స్ఫూర్తి నిశ్శబ్దంగానే ఎందరో ధార్మిక యోధుల్ని తయారుచేసింది. దేశ సౌభాగ్యంకోసం వారు నిర్వహించిన, నిర్వహిస్తున్న యాగాలు అనేకం.
‘‘మనకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాం. సంతోషమే, కానీ అంతకంటె ముఖ్యంమన దేశ క్షేమం గురించి ప్రార్థించాలి. తన క్షేమం కంటె, దేశ క్షేమంకోసం ప్రార్థించే వారి క్షేమాన్ని భగవంతుడు ప్రధానంగా అనుగ్రహిస్తాడు.’’ ఇది వారిచ్చిన మహాసందేశం. హిమగిరుల నుండి సముద్ర తటాలవరకు విస్తరించిన భవ్య భారత చరిత్ర వారికి కరతలామలకం. విభిన్నరాష్ట్రాల ప్రజలనేకాదు, విదేశాలలోను హిందూ ధర్మ పరిశోధకులు డా.డేవిడ్ ఫ్రాలే వంటి మేధావులు కూడా వారిని ఆశ్రయించి స్ఫూర్తినీ, సరియైన దృక్పథాన్నీసంపాదించుకున్నవారే.
ఈ దేశాన్నీ, దీని స్వాభావిక ఆర్షధర్మాన్నీ ఎప్పటికప్పుడు గమనించి కాపాడుకునే ఒక సిద్ధ వ్యవస్థ- సూక్ష్మభూమికలో సిద్ధ భూములలో ఉంది. ఆ వ్యవస్థనుండి ఒక మహాప్రయోజన సిద్ధికై వచ్చిన జీవన్ముక్తులు మా గురువుగారు శ్రీ శివానందమూర్తిగారు. తాను శైవ సంప్రదాయంలో జన్మించి, శివయోగిగా పరిణిమించి, ఆ అద్భుత శివయోగంలో సమగ్ర భారతీయతను పొదువుకున్న ‘జ్ఞానప్రేమ’వారిది. అందుకే వారి శిష్యుల్లో శైవ వైష్ణవాది సర్వసంప్రదాయాల వారున్నారు. అన్నికులాల, రాష్ట్రాలవారూ ఉన్నారు. వారి ఆదేశంతో కాశీలో ఆధ్యాత్మిక సాధనచేస్తున్న కొందరు విదేశస్థుల గురించి తెలుసుకొని ఆశ్చర్యం కలిగింది.
‘‘దేవతల కంటె ఋషులనే ముందు స్మరించి ఆరాధించాలి. దేవతలు కూడా ఋషులవల్లనే తెలియబడుతున్నారు. వారుకూడా ఋషుల మాటకు కట్టుబడి ఉంటారు’’అంటూ ఋషుల గొప్పతనాన్ని ఎన్నోమార్లు వింగడించారు. వారి మాటలో, వ్రాతలో మహర్షుల చరిత్రలు స్ఫూర్తిదాయకంగా వెలుగులీనాయి. రాజకీయాలు, సామాజిక పరివర్తనలు, మారుతున్న జీవన మూల్యాలు... ఇలా అన్ని పరిణామాలను పరిశీలిస్తూ, వాటిని ధార్మిక దృష్టితో సవరించుకోవలసిన బాధ్యతను, విధానాలను స్పష్టంగా, నిష్పాక్షికంగా సూచించారు. నేటి రాజకీయ విధాన నిర్ణేతలు వాటిని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఒక సమగ్ర దృష్టి కలిగిన వారి సందేశాన్ని పాలనా బాధ్యత కలిగినవారు. గమనించేలా, శిష్యులైన మేధావులు బాధ్యత. వహించాలి. దేశంలో ప్రధాన పీఠాధీశ్వరులందరికీ మా గురువుగారిపై ప్రత్యేక ప్రేమ మాత్రమే కాదు, విశిష్ట గౌరవభావముంది. పీఠాల నడుమ ఎవరి పరిమితులు. వారికి ఉన్నప్పటికీ, ఈ సద్గురువు విషయంలో అపరిమిత సౌహార్దం, మన్నన అన్ని పీఠాలు కనబరచుతూనే ఉన్నాయి.
సద్గురువుల రచన ‘కఠయోగా’నికి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామివారు అనుగ్రహించిన విస్తార శ్రీముఖం, ఇటీవల ఆంధ్ర దేశ పర్యటనలో పీఠాధీశ్వరులు గురువులతో ఆత్మీయంగా ‘ఆనందవనం’లో సమావేశమవడం దివ్య ఘట్టాలు. నేపాల్, కాశీ, భారత ఈశాన్య రాష్ట్రాలు, ఇలా ఎన్నో ప్రాంతాలలో, కేవలం యాత్రా దృష్టిగాకాక, ఒక తపశ్శక్తితో, భారతీయతా పరిరక్షణ దృష్టితో సంచరించి వీరిచ్చిన సందేశాలు, చేసిన స్ఫూర్తిమంతమైన కార్యాలు అందరూ గమనించి గ్రహించవసినవి. సముద్రతీరంలో సముద్రతనయ అయిన మహాలక్ష్మీ ఆలయాన్ని ‘ఆనందవనంలో, ఉత్కళ శిల్పంలో నిర్మించిన మహోపకృతికి వందనాలర్పించవలసినదే. ‘ఆద్యాలక్ష్మి’రూపంగా పరాశక్తిని ప్రతిష్ఠించి, ‘దేశదారిద్య్రా’న్ని తొలగించమని ప్రార్థించారు. మనచేత ప్రార్థింపజేస్తున్నారు. అనేకమంది జీవితాల్లో వీరి అనుగ్రహ ప్రభావాలు కోకొల్లలు. కానీ అవి ప్రకటితాలు కాకుండా, గుప్తంగానే, తన జ్ఞానస్ఫూర్తిని ప్రసరింపజేయడం సద్గురువుల ప్రత్యేకత. వారి కారణజన్మ బహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది.
1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ, ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా అసంఖ్యాకులను ప్రేరేపించి వారి జీవితాలను ధర్మమయంగా తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం.
... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
భారతీయ విజ్ఞాన సంపదలు, సంస్కృతి నిక్షేపాలన్నిటినీ పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను- తానుచేస్తూ, మనకు బోధించారు. ‘‘గురువు ఒక వ్యక్తికాదు. ఈ అనంత విశ్వంలో గురువు ఒక జటిల ప్రశ్న- దాని సమాధానమూను.’’అని ఎంతో గూఢంగా వచించే సద్గురువులు పరంపరాగతమైన, ఋషి సంప్రదాయ సిద్ధమైన గురుతత్వానికి సాకారం.

What is Hinduism?

https://www.facebook.com/vallury.sarma/posts/601727869864630

What is Hinduism?
• One of the oldest religions of humanity
• The religion of the Indian People
• Gave birth to Buddhism, Jainism and Sikhism
• Tolerance and Diversity “Truth is one, paths are many”
• Many deities but a single impersonal reality
• A philosophy and a way of life – focussed both on this world and beyond.
V V S Sarma
I do not agree with any of the statements above. They are naïve, simplistic and are responsible for all the problems Hinduism and Hindus are facing in today’s world. 
Discussion

1. What are the other oldest religions in the world which have any measurable following today? It is the only oldest living religion and its name is not Hinduism. A correct description is Sanatana Dharma and it is a recent name for several religions, viewpoints, philosophies (darsanas) lumped together with a single name – Saiva, Vaishnava, Sakteya, Ganapatya, Kaumara, Saura – being the shanmatas, at least six astika and six nastika darsanas, which are different; many existing today also and evolving in the framework even today. 

2. Even in a lumped form, it is only one of the religions of the many inhabiting Republic of India, Pakistan, Nepal, Bangladesh, Bali in Indonesia, Sri Lanka, and the rest of the world. 

3. A religion does not give birth to other religions. Just as Abrahamic religions Judaism, Christianity of very many churches, and Islam of its own divisions are religions with the same roots, Buddhism, Jainism and Sikhism or for that matter the more recent Brahmo-samaj, ISKCON, are various viewpoints or ways of life evolved from Sanatana dharma and some of them may not even consider themselves as Hindus. Some similarity to Protestantism may be relevant. If Buddhism rejects pramana of Veda it is that much farther from the source. Same is true of Marxists with Hindu names. It is Western Historians and the English rulers who widened these gaps as part of their divide and rule policy. (Division of Bengal in 1905 and 1947)

4. Tolerance and diversity – Tolerance is not accepted by major Indian religions like Christianity. Christian Evangelism is intolerance promoted by hundreds or thousands of missionaries and church hierarchy. It is peaceful coexistence – like LOC in Kashmir – that is the goal. Hindus when they say - “Truth is one, paths are many”- They say in blissful ignorance of other paths. This is bad translation of “Ekam sat vipraa bahudhaa vadanti.” What is the truth of each one of the many religions and where does each path lead to? Who are the wise men who say this about this? In fact, I have seen bill boards proclaiming “I am the only truth and the only path” in this city. 

5. Many deities but one reality. … The worship is that of many deities with name and form – saguna form – the realization of nirguna may not be attainable in one life time. Reality and Truth are different notions. God is not more logical than gods, because it is the divinity that exists. The reality should be understood at the back of mind. Each deity has its own role in worship. 

6. Hinduism is principally materialistic. Belief in God helps you to face samsara with courage and strength. Dharma, Artha, Kama are for happy living in this world. Yajna is for the happiness of svarga and good rebirth in the next life. The religion is mostly for this. Moksha is to be a strong desire that is to be cultivated at some point in the gati. The illusionary nature of the world should naturally be felt and experienced as one goes along. The concept of Guru is unique to Hinduism in this Kali Yuga. Siva, Krishna, Subrahmanya, Maitreya, Dattatreya, several maharshis etc. 

The need today for Hindu society is to understand that there is need for recognition of a bond between all of us, understand the religion more correctly, and look at the social and political issues of Hindus collectively. Hindus have to realize that religion is more important than caste.

Padmini Priyadarsini ప్రతీ వాక్యాన్ని చాలా బాగా వివరించారండీ. ప్రస్తుతం 'సనాతన ధర్మం' ఉన్న స్థితిలో మరికొన్ని తప్పుడు భావాలు ఇలా ప్రచారం కావటం మంచిది కాదు. అందుకే, ఆ స్టేటస్ డిలీట్ చేసాను పెదనాన్న గారు. ధన్యవాదాలు.

Monika Sethuraman Reddy writes - I tried to believe that there is a God, who created each of us in His own image and likeness, loves us very much, and keeps a close eye on things. I really tried to believe that, but I gotta tell you, the longer you live, the more you look around, the more you realize, something is fucked up. ---- Your frustration is due to the fact that the story of God and creation you heard is unsatisfactory. There are better accounts of creation. In fact Hindu Puranas give a much more convincing theory of creation.


https://www.facebook.com/vallury.sarma/posts/598681563502594

మకు తెలిసిన భాష ను ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్ళు 'వాచామాగోచరుండైన" మన స్వామిని ఎలా తెలుసుకోగలరు?
Monika Sethuraman Sir, for me God is energy .. and Hinduism says there is no matter without energy .

That quote was George carlin slamming those who believe in God the father the creator.
Monika Sethuraman Thank u Sir ..

Don enlighten me when u get time ..(.but in english sir)
 
జాజి శర్మ ఆదిశంకరులు తమ సౌఉదర్యలహరి ప్రారభించినదే "శివ శక్త్యాయుతో " అని శక్తి లేకుండా ఏమి జరగదు. మీరు పెద్దలకు వ్రాసేటప్పుడు భాషా ప్రయోగం సరిగా చెయ్యలేదు అనేది నా వినతి.
జాజి శర్మ In fact, Adi Sankara started "Soundarya Lahari" thus, "Sivasaktyayuto", explaining that without Energy (Shakti), there is no Shiva . MY submission is that the youngsters should learn how to write to elders when they want to attain good knowledge. That is Called PARIPRASNA" in Sanatana Dharma.


Monika Sethuraman * TYPO its DO ENLIGHTEN ME WHEN U GET TIME
Sumalini Soma GOD is ultimate truth that each individual experiences him / herself. It is such a truth, it reaches you when you are ready. When you know GOD, you will be awestruck!!!! It is the most beautiful thing you experience. Seeking the right answers from right people, in a right way shows you are in the right direction.

Sumalini Soma Vvs Sarma Sarmagaru, because of his background, & depth of knowledge has an innate talent, in explaining the incomprehensible stuff, in a simple way. I loved his explanation of "universe" so much. Sarmagaru, We are so very thankful for everything you do. Pranams.
 
Acharya Sadananda There are supposed to 80 theories of creation even in Hindu scriptures depending on who is asking the question. In the ultimate analysis there is no creation since Brahman being infinite and infinite cannot undergo modification creation is modification...See more
Sumalini Soma @acharya sadananda - I feel like, I understand partially & partially I don't. We know the world is midya. We are perceivings the way we do, because we are made that way. Yes, when we understand ultimate consciousness, everything doesnot make any sense. But, to understand the physical world, the way we experience, the way curiosity is built in to us, we would like to know everything? What are those 80 theories of creation. Pranavam & pralayam theory, goes so well with the modern day big bang theory. It amazes me, how our sages, even thought about a theory, so close to what is confirmed scientifically? How even they had grasp of those long distances? It looks like, you know more. Can you please shed some light on this?
Vvs Sarma Thanks all of you. I agree with what Sadananda garu explained. We are part of one Brahmanda, there are many brahmandas. It is impossible to know the ultimate Truth, Brahman by our location, We can not even know fully about the physics of Milky Way. Each darsana has a theory of creation. The point is eaxh Darsana is observer's perception and inference

Acharya Sadananda Sumalini - PraNAms . I am giving below an article I wrote few years ago on the concept of creation. I am providing a reference below. Actually Big Bang theory has lot of problems - Space and time forms with the bang only - mathematically speaking it is a singularity. Where did big bang occurred, cannot be asked. What was there before big band also cannot be asked. It occurred everywhere even though everywhere is a concept of space. In fact it occurred where the questions is or where conscious enquirer is since big band is extrapolation of the time-space scale backwards where all the expanding galaxies meet. The meet at the point of the observer who is doing the extrapolation. Here is the article and many others also. http://forum.advaitaforum.com/index.php?topic=218.0Manage
t 1/2)  forum.advaitaforum.com
Sumalini Soma Acharya Sadananda PraNAms Acharyagaru. I will ready once I am back home today. Thank you so much for the material provided. Vvs Sarma PraNAms Sarma garu. Are we made not to know the ultimate truth? Why our thirst for knowledge is unstiating?

కర్ణాటక రాజ్యోత్సవం, ఆంధ్ర ప్రదేశ్ విభజనోత్సవం

https://www.facebook.com/vallury.sarma/posts/590805730956844

కొల్లూరు విజయా శర్మ కొన్నేళ్ళుగా ఆంధ్రాలో మంత్రులు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పాలుపంచుకోవట్లెదు. కలెక్టర్లకే అధికారాలు కట్టబెట్టి వాళ్లనే జెండాలు ఎగరేయమంటున్నారు .. మరోవైపు కొందరికి అది విద్రోహ దినోత్సవం. ..ఇక్కడ కన్నడ రాజ్యోత్సవాలు దాదాపుగా -నెలరోజులు జరుపుతారు. దాదాపు నవంబర్ అంతా ఇక్కడ పండుగ వాతావరణం .. ఇక విభజన అన్న మాట గుర్తొస్తే గుండె కలుక్కు మంటూనే ఉంది. ఇంత చేదు నిజం ఇప్పటికీ మింగడం సాధ్యం కావట్లేదు. 

రాష్ట్ర విభజన - తక్షణ కర్తవ్యాలు

https://www.facebook.com/vallury.sarma/posts/595280250509392

మహామహోపాధ్యాయ సద్గురు శివానందమూర్తి 11/11/2013 Andhra Bhoomi
సుమారు మూడు మాసాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంఘర్షణతో అశాంతిగా ఉంది. ప్రభుత్వం నడక, ఆర్.టి.సి. వాహనాలు స్తంభించిపోయి, ప్రజలెన్నో కష్టాలకి గురి అయినారు. మొదటి కారణం కేంద్ర ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రకటన, రెండవది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఈ రెండు వర్గాలు కూడా నాయకుల చర్చలు, సంప్రదింపులు అనేవి లేకుండానే క్రియకు ఉపక్రమించడం జరిగింది. తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం తప్పు అనడం సరికాదు. ఎందుకంటే అది కూడా 40 ఏళ్ళనాటి ప్రజా ఉద్యమమే. అయితే ఏకపక్షంగా చేసిన తీర్మానం కొంత తొందరపాటు చర్య. సీమాంధ్రకు, ముఖ్యంగా ఉద్యోగులకు విభజనవల్ల జరగబోయే సాంఘిక, సామాజిక, ఆర్థిక సంక్షోభం ఒక గొప్ప భూకంపంలాంటిదే. అయితే కష్టనష్టాలు కనీసం పదేళ్ళపాటు భరించాక తరువాతి కాలంలో స్వతంత్రాంధ్రప్రదేశ్ ఎటువంటి లాభం పొందగలదూ? అని దూరాలోచనతో ఆలోచించాలి. కావాల్సినంత ఆర్థిక, రాజకీయ సహాయ సంపత్తిని కేంద్రం నుంచి పోరాడి తీసుకోవలసి ఉంటుంది.
కనీసం 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఆదాయం రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. ఆంధ్రకు ఒక నూతన ఉత్తమ రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, నదీజలం, విద్యుత్తు వాదించి తీసుకోవలసిన సంపదలు. నదీ జలాల పంపకం అన్ని ప్రాంతాల వారికి కేంద్రమే న్యాయంగా నిర్ణయించాలి. ఇంకా పదివేల పడకల ఆసుపత్రులు అవసరమవుతాయి. లక్షమంది ఉద్యోగుల కుటుంబాలకు, కనీసం 100 లక్షల చదరపుటడుగుల గృహవసతి సౌకర్యాలతో కావాలి. ఇదికాక 20 లక్షల చదరపుటడుగుల స్థలం ప్రభుత్వ కార్యాలయాలకు కావాలిసిందే. ఇదంతా కేంద్రం భరించక తప్పదు కదా! ఒకవేళ తప్పనిసరి అయితే ఇవన్నీ సాధించడానికి ప్రణాళికలు రూపొందించవద్దా? అంతేకాక ఈ హక్కులు, బాధ్యతలు మొదలైనవన్నీ రేపు లోక్సభలో పెట్టబోయే బిల్లులోనే స్పష్టంగా చేర్చి పెట్టాలి. దానికి కావలసిన సిబ్బంది, కాలవ్యవధి ఆలోచించకుండా మూడు నెలలు నష్టపోలేదా మనం?
సరే.. సమైక్యంగా 55 సంవత్సరాలలో ఆంధ్ర సీమ ఏం గొప్ప ప్రగతి సాధించింది? ఏదైనా ఒక మహానగరం రూపుదిద్దుకుందా? ఈ సీమలో ఏదైనా ఒక్క పెద్ద విమానాశ్రయం లభించిందా? సీమలో ఏదైనా ఒక్క అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గాని, ఉత్తమశ్రేణి విద్యాలయం గాని ఆవిర్భవించిందా? ఏదైనా ఒక గొప్ప పరిశ్రమ సీమలో ఏర్పడిందా? బెజవాడ నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న హైదరాబాదు పట్టణం సీమ ప్రజలకు చాలా సౌకర్యంగా నిలిచిపోయిందా? ఇలా వెతికి చూస్తే సీమాంధ్రకు ఏకైక రాష్ట్రంలో ఎటువంటి లాభాలు, ప్రగతి లభించాయి? అనేది తెలుస్తుంది. హైదరాబాదులో తమకున్నదంతా పెట్టుబడి పెట్టినవారికి వ్యాపార లాభాలు, బహుశా వందమందికి లభించి ఉండవచ్చు. అది సీమకేం లాభం? ఉద్యోగానికి వెళ్ళినవారు ఒక లక్షమంది హైదరాబాదులో సొంత ఇళ్ళు కట్టుకున్నారేమో? తరతరాలనాటి సొంత ఊరు వదిలిపెట్టి, దూరం వెళ్ళి, కుటుంబానికి ఒక కోటి అప్పు చేసి సంపాదించడం ఒక గొప్ప ఐశ్వర్యమా? ఆంధ్ర రాష్ట్రం వేరుగా ఉండి ఉంటే అంతకన్నా మంచి పట్టణం ఇక్కడ సొంత ఊళ్ళకి దగ్గరగా పుట్టి ఉండేది కాదా? అసలు హైదరాబాద్ తెలుగు పట్టణమా? సుమారు 15 లక్షల మందికి తెలుగు బాగా రాని పట్టణము. వ్యాపారమంతా తెలుగువారి చేతిలో ఉందా? లేదు కదా! భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు అన్ని భాషలతో పంచుకున్న పట్టణమే హైదరాబాదు. ఇలా ఆలోచిస్తే సీమాంధ్రులకు స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తితో వేరొక తెలుగు రాజధాని కాలక్రమేణా లభించడం కోరుకోదగినది కాదా?
ఇక తెలంగాణ విషయం
ఇది ఇలా ఉండగా సమైక్యతలో 55 ఏళ్ళలో తెలంగాణ వారికి లభించిన ప్రగతి ఏది? వరంగల్లో ఘీౄ చ్ఘ్దజ జ, 5000 కుటుంబాలని పోషించేది మూతపడింది. హైదరాబాద్ పట్టణంలో గళఔఖఇజష యూళ, -్ఘ్ఘ య్యఒ, తీకశఒ, హ వంటి ఉన్నత స్థాయికి ఛెంది, విజయవంతమైన పరిశ్రమలు సమైక్య ప్రభుత్వ కాలంలో మూతపడిపోయాయి. అంటే నైజాం కాలంలో పుట్టిపెరిగిన సంస్థలు కూడా మూతపడ్డాయి. తెలంగాణలో గ్రామీణ ప్రజల పేదరికం మార్పు చెందలేదు కదా? ఇలాగ ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఆంధ్ర ప్రజలు హైదరాబాద్కి వెళ్ళి ఉండవచ్చు. తెలంగాణ ప్రజలు ఆంధ్రకి రానే లేదు. ఇదంతా సహజీవనమా? సామరస్యమా? లేక సమైక్యతా? తెలంగాణ ప్రజలలో సీమాంధ్ర ప్రజల పట్ల సుహృద్భావం, స్నేహం ఏర్పడిందా? కొన్ని వర్గాలలో ద్వేషం కూడా ఏర్పడింది. మరి సహజీవనం, సామరస్యం ప్రజల మధ్యన ఎలా సాధ్యవౌతాయి? దానివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు సాగడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రభుత్వ సిబ్బందిలో అనైక్యత ఇప్పుడే వచ్చేసింది. తెలంగాణ వారు తిరస్కరించిన సమైక్యత, సీమ ప్రజలు ఎలాగ సాధిస్తారు? ఇవన్నీ ఆలోచిస్తే 5 లేక 6 సంవత్సరాలు కష్టనిష్టూరాల తరువాత సీమ ప్రజలు ఒక సుందర రాజధానిని తమకోసం వేరుగా సాధించుకోవచ్చు. అలాగే రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు తప్పక సాధ్యవౌతాయి. ఉన్నత శ్రేణి జాతీయ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన య్యెశ డష్ద్య్య వంటి సంస్థలు మన రాష్ట్రంలోని పర్వత సీమలలో నెలకొల్పుకోవచ్చు. తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో ఎన్నో గొప్ప సంస్థలు టీ, కాఫీ తోటలు, అనేక పర్యాటక కేంద్రాలు నూరేళ్ళ నుంచి అక్కడి దేశాన్ని, ప్రభుత్వాన్ని కూడా అపార ధనవంతుల్ని చేశాయి. అటువంటి పని ఆంధ్ర సీమలోని నల్లమలై, రత్నగిరి, విశాఖ సమీపంలోని అనంతగిరి పర్వతాలు ఎన్నో ఉండగా ఈ సమైక్య ప్రభుత్వం వాటినెందుకు వినియోగించుకోలేకపోయింది? కేంద్రం అధికారంలో ఉన్న ఈ ప్రాంతాలు సీమ ప్రజలకిగాని, ప్రభుత్వానికి గాని, అక్కడ జీవిస్తున్న ఆటవిక జాతులకు కాని ఎటువంటి ఆదాయము, ఉపయోగము కల్పించలేదు. కేంద్రం విభజన క్రియలో వేగంగా ముందుకు పోతోంది. 50 ఏళ్ళనాటి పరిపాలనలో రెండు ప్రాంతాలలోనూ సాధించిన ప్రగతి గొప్పగా ఏమీ లేదు. విభజనలో సీమాంధ్ర ఉద్యోగులకు మాత్రమే కలుగబోయే కష్టాన్ని, నష్టాన్ని అధిగమించడానికి కేంద్రం నుంచి హక్కుగా సాధించవలసినవి ధనము, శాసనపరమైన ప్రత్యేక హక్కులు ఎన్నో ఉండగా ఆ విషయంలో ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకోక ఆందోళనతో కాలం గడచిపోయింది. ప్రజలు కష్టపడ్డారు. కేంద్రం వాళ్ళకి తోచింది ఇవ్వడానికి ఇప్పుడిప్పుడు సిద్ధపడుతున్నారు. హైదరాబాద్లోని ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకి వెళితే మిగిలిన ఆంధ్ర ప్రజలు అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నట్లే హైదరాబాదులో ఉండిపోగలరు. వాళ్ళని వెళ్ళగొట్టే హక్కు ఎవరికీ లేదు. ఐటిలో సీమప్రజలెంతమందో ఉన్నారు. వారికెవరూ అపకారం చెయ్యలేరు. సాధించవలసిన హక్కులు, హామీలూ ఎన్నో ఉన్నాయి. పోలవరం రెండేళ్ళలోపల పూర్తిచేసే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. నీరు, విద్యుత్ నిబంధనలతో సాధించాలి. కాలవ్యవధి చాలా తక్కువ. విభజనతో ఆంధ్రకి అంతా నాశనమే వంటి మాటలు పలుకకూడదు. ఆంధ్ర సీమ మనుగడ తెలంగాణ మీద ఆధారపడి లేదు. విభజన తరువాత రెండు ప్రాంతాలు ఒక మాతృభాషతో సోదరభావం పెంచుకోవచ్చు. అందరూ శాంతిగా ఆలోచించవలసిన సమయం ఇది.
రాయలసీమ విషయం
ఇక రాయలసీమ వారితో స్నేహం కుదుర్చుకొని ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అది కూడా బిల్లులో స్పష్టం చేసుకోవాలి. తిరుపతి వెనుకనున్న పలమనేరు నుండి కర్నూలు వరకు గల పర్వత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చాలా ఆదాయం వస్తుంది, అందరికీ లాభం కలుగుతుంది. నల్లమలైకొండలు కొంత భాగం ప్రజల ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఈ విషయంపట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఆ విధంగా రాయలసీమ ఎంతో లాభం పొందవచ్చు.
ఇక కేంద్రం విషయం
ఇక ప్రభుత్వ కేంద్రం విశాఖపట్టణమైతే అది ఒక మహానగరం కావచ్చు. సమీపంలోని పర్వత సీమలు ప్రజల యొక్క ఉపయోగంలోకి రాగలవు. దానికి అనుమతులు కేంద్రం నుంచి సాధించాలి. గుంటూరు సీమ రాష్ట్ర మధ్యభాగంలో ఉన్నా వేసవిలో అక్కడి వేడి 45 డిగ్రీలదాకా వెళుతుంది. అప్పుడు విశాఖలో వేడి 7, 8 డిగ్రీలు గుంటూరు కన్నా తక్కువ ఉంటుంది. పట్టణంలోనే ఉన్న కొన్ని కొండలనైనా నివాసయోగ్యంగా తీర్చవచ్చు. వాటికొక అందచందాలుంటాయి. విశాఖ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వేసవిలో పనిచేయని ప్రభుత్వ కార్యాలయాలు హైకోర్టు లాంటివి, కొన్ని విశ్వవిద్యాలయాలు గుంటూరులో ఉండవచ్చు.
త్రవ్వి సిద్ధంగా ఉన్న కాలువలు గోదావరి నదీ జలాలను సమృద్ధిగా తేగలవు. త్వరలో పోలవరం సిద్ధమయితే ఇప్పుడు సముద్రం పాలవుతున్న 90 శాతం గోదావరి, కృష్ణానదీ జలాలు (వరదల సమయంలో) కొంతవరకైనా ప్రజలకు కాలువల ద్వారా కూడా ఉపయోగం కావచ్చు. అలోచించవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. విరోధము, ద్వేషము లేకుండా విడిపోతే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి సాధించగలవు.

On Cosmologies – New Series – 10


V V S Sarma
నరకములు
ఇట్లు అధోలోకములను గురించి వివరించిన శ్రీశుక మహర్షి, పరీక్షిత్తుని, మహారాజా, ఇక ఏమి చెప్పను? అని అడుగుతాడు. జంతుజాలముల శ్రద్ధలు త్రిగుణాత్మకములు గావున ఆయా జీవులు కర్మ వశముగా అనేకజన్మలలో వేర్వేరు లోకములలో సంచరిస్తారు. అధోలోకములలో సుఖాపేక్ష, భోగలాలసత ఉంటాయి కాని మోక్ష విచారము ఉండదు. జీవులకు ఎక్కువగా ఆసురీసంపత్తి ఉంటుంది. అధర్మ వర్తన గల జీవుల కర్మఫలము కూడా విపరీతముగానే ఉంటుంది. అధర్మ వర్తన వలన, కామాది వికారముల వలన కలిగిన కర్మ ఫలములను నీకు వివరిస్తాను. --- శుకునితోఁ బరీక్షిన్నరేంద్రుం డి ట్లనియె.
“మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల
యందొ? యంతరాళమందొ? వెలినొ?
యదియుఁ గాక దేశమందుండు భూవిశే
షముల యందొ? తెలుపు సంతసమున." ------------- (భాగవతము)
దానికి శుకుడు ఇలా బదులుచెబుతాడు. "రాజా మూడులోకములకు అవతల భూమ్యాకాశాల మధ్యన దక్షిణదిశలో ఈ నరకాలు ఉంటాయి. అంటే భూలోకానికి ద్యులోకానికి మధ్యాంతరాళంలో యమలోకానికి సమీపముగా దక్షిణ దిశను నరకములుంటాయి. ఆగ్నిష్వత్తాది పితృ గణములుండే పితృలోకము కూడా దక్షిణ దిశలోనే ఉంటుంది. దాని అధిపతికూడా యముడే. అతడు తనవద్దకు వచ్చిన జీవుల పాపకర్మలకు వానికి తగినఫలములనిచ్చి శిక్షిస్తాడు. ప్రధానముగా 21 నరకములను చెబుతారు - వాటిలో కొన్నిటి పేర్లు తామిస్రము, అంధతామిస్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాల సూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, వైతరిణి, క్రిమిభోజనము,మొదలైనవి, అలాగే సూచీముఖము వంటి మరొక ఏడు మొత్తము 28 నరకముల పేర్లు భాగవతము చెబుతున్నది. కలియుగంలో అధిక సంఖ్యాకులకు ఇదేమార్గముగా కనుపిస్తుంది. ఈ పేర్లు అక్కడ శిక్షల ప్రాతిపదికగా కనుపిస్తాయి. కుంభీపాకం అంటే వంటపాత్రలో ఉడికించుట - అంత దుఃఖాన్ని కలిగించే నరకం, రౌరవం అంటే వేదనతో దుఃఖంతో ఆర్తనాదాలుచేసే నరకం, సూచీముఖం అంటే సూదులతో గుచ్చి ఏడిపించే నరకం - మృత్యుబాధ వేయి వృశ్చికములు ఒకేసారి కుట్టినట్లు ఉంటుందట. దానికి వాచవి ముందే లభిస్తుంది. ఆసుపత్రి ICU లో భూమిమీదే అనుభవానికి వస్తుంది.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...