Sunday, January 21, 2018

ఆంధ్రదేశంలో బౌద్ధజైనాలు ఎప్పుడు వచ్చాయి?


ఆంధ్రదేశంలో బౌద్ధజైనాలు ఎప్పుడు వచ్చాయి? చాలా ముందుగానే అనిచెప్పాలి. సా.శ.పూ. 150 ప్రాంతాలలో ఖారవేలుడు అనేరాజు కళింగ ప్రభువు. అతడి సామ్రాజ్యం కోస్తా ఆంధ్ర అంతాకూడా వ్యాపించింది. ఆయన జైనుడు. అంతకుముందే అశోకుని ద్వారా బౌద్ధమతం కొంత ప్రచారంలోకి వచ్చినది. ఖారవేలుని తరువాత వచ్చిన శాతవాహనుల కాలంలో బౌద్ధం నేటి గుంటూరు జిల్లా లో వ్యప్తిచెందినది. నాగార్జునుడు (సా.శ. 200 ప్రాంతం) కీలక గురువు. తరువాత దేశమంతా వ్యాపించినది. జైనం వర్ణవ్యవస్థను పట్టించుకోలేదు. జైనంలోనికి మారినవారు కులాలను యథా తథంగాఉంచుకుని మళ్ళీ సనాతన మతంలోనికి అలాగే మారిపోయారు. తరువాత కాలంలో (సా.శ 500-900) చాళుక్యుల ద్వారా జైనం పోషింపబడినది. తరువాత నాథ సన్యాసులూ, పంచాచార్యుల ద్వారా శైవం వ్యాప్తిలోకి వచ్చింది.అగస్త్య మహర్షి కాలంనుండే దక్షిణదేశమంతా శైవం వచ్చింది. అన్ని మతాలు ఉండేవి. ఎవరికి నచ్చినది వారు పాటించే వారు. 12 వ శతాబ్దానికి వీర శైవం, వీర వైష్ణవం వచ్చాయి.విభజన, విద్వేషం అనాదిగా మానవుల లక్షణం.
LikeShow More Reactions
Comment

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...