Friday, January 19, 2018

గాంధీ – జైనం



ఆధునిక భారత చరిత్రలో కూడా జైన బౌద్ధాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈనాడు మన దేశంలో 80 లక్షల మంది బౌద్ధులు, 40 లక్షల మంది జైనులు ఉండ వచ్చును. జైన మతం కూడా ఐహిక జీవనంలో ప్రవర్తనకు ముఖ్య స్థానం ఇస్తుంది. ఈమతం 24 మంది తీర్థంకరుల ద్వారా వ్యాప్తి చెందినది. 24 వ తీర్థంకరుడు మహావీరుడు స్థాపకుడని చరిత్ర పుస్తకాలు చెబుతాయి. ఆయన బుద్ధుని సమకాలికుడు.
జైనుల న్యాయ తర్కాలు కూడా బౌద్ధుల న్యాయము వలెనే వైదికుల న్యాయము కంటె శక్తివంతమైనది. వారి న్యాయాన్ని అనేకాంత వాదము, స్యాద్ వాదము, నయ వాదము అని చెబుతారు. అనేకాంతవాదమంటే పరస్పర విరుద్ధమైన, వ్యతిరేకమైన భావాలను జైనం అంగీకరిస్తుంది. వారి న్యాయం లో ఈఅంగాన్ని నయవాదము అంటారు. సప్తభంగినయం అంటే - స్యాదస్తి, స్యాన్నాస్తి, స్యాదస్తి చ నాస్తి, స్యాదవక్తవ్య, స్యాదస్తి చ అవక్తవ్య,స్యాన్నాస్తి చ అవక్తవ్య, స్యాదస్తి చ నాస్తి చ అవక్తవ్య. May be it is, May be it is not, May be it is and is not, May be it is indescribable, May be it is and is indescribable, May be it is not and is indescribable, May be it is, it is not and is indescribable" దేవుడున్నాడా? అంటే జైనుడికి ఎలా అన్నా సంతోషమే, బహుశా ఉన్నాడు, బహుశా లేడు, బహుశా ఉన్నాడో లేడో, బహుశా అనిర్వచనేయుడేమో... ఇలా ఏడు రకాలు. This is an ancient Indian exposition of FUZZY LOGIC. జైనమత ప్రభావం మనమీద ఇంతా అంతా కాదు. 67 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ సమస్యకైనా అనేకాంతవాదం చేయడం మన ప్రజల, మన ప్రభుత్వ విధానంగా మారిపోయింది. ఒక ఉగ్రవాదికి శిక్షవేయడానికి కూడా మనకు దశాబ్దాల కాలం పడుతుంది. మనము ఏప్రశ్న నైనా "అంధగజన్యాయం" (Elephant and the blind) తోనే పరిష్కరించడానికి పూనుకొని విఫలమౌతాం.
జైన మతంలో ముఖ్యాంశాలు - అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఆధునిక యుగంలో రాజకీయాలలో వీనిని ప్రబోధించినవాడు గాంధీ మహాత్ముడు. నిజానికి ఆయనను ప్రచ్ఛన్న జైనుడు అనవచ్చును. క్షత్రియులు స్థాపించిన జైనమతాన్ని పోషించి, ఆదరించినవారు వైశ్యులు. మహావీరుని కుమారులు భరతుడు, బాహుబలి. బాహుబలినే గోమఠేశ్వరుడు అంటారు. ఆయన అరిహంత. మానవునిగా పుట్టి నిర్వాణము పొందినవాడు. "ఓం నమో అరిహంతానాం" జైనుల ధ్యానమంత్రం. (బౌద్ధులు ఓం మణిపద్మేహం అంటారు.) ఆయన విగ్రహం, కర్ణాటక లోని హసన్ జిల్లా , శ్రావణ బెళగోళ లో చూడవచ్చు. గోమఠేశ్వరునినుండి వచ్చినపేరే కోమటి. స్వాతంత్ర్యయోధులలో తిలక్ బ్రాహ్మణుడు, అరవిందుడు, సుభాష్ బోస్ క్షత్రియులు, గాంధీ వైశ్యుడు. స్వభావాలలోని వ్యత్యాసం గమనింప వచ్చు.

Nandiraju Radhakrishna జైనుడు-గాంధి; క్షత్రియులు-వైశ్యులు అద్భుత వివరణ ఇచ్చారు. తిలక్, అరవిందుడు, సుభాష్ చంద్రబొస్, గాంధి మధ్య వైరుధ్యాలను గొప్పగా ఆవిష్కరించారు. ఇవి ఈ తరాలకు తెలియాలి..వందనాలు..


An Indian Marxist historian, D D Kosambi's dedication of his work on Bhartrhari is as follows
నూతన మానవ సమాజస్య పురశ్చరణం మార్క్స్-ఎంజెల్స్-లెనిన్- నామధేయాం తేజస్వినాం మహామానవానాం పునీత స్మరణార్థం (To the sacred memory of the great and glorious pioneers of today's society, Marx, Engels and Lenin)



No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...